ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ, యోగి ఆదిత్య కు సవాల్

ప్రియాంక గాంధీ కి తూర్పు ఉత్తర ప్రదేశ్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవి కేటాయిస్తూ, ప్రియాంక గాంధీ సోదరుడు కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీ ఈరోజు కీలక ప్రకటన చేశారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

పార్లమెంటు ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ ఎంత కీలకమైన దో అందరికీ తెలిసిందే. దాదాపు 80 ఎంపీ సీట్లు కలిగిన ఉత్తరప్రదేశ్ ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఏ ప్రభుత్వం రావాలో నిర్ణయించే రాష్ట్రంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రాన్ని బిజెపి పరిపాలిస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ భారతీయ జనతా పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నాడు. కాబట్టి ఆయనను ఢీ కొట్టడానికి, ఉత్తరప్రదేశ్ ఫలితాలను మలుపు తిప్పడానికి రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతోంది.

ప్రియాంక గాంధీ వాద్రా గతంలో కూడా కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, ఆమె ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఉండకపోవడం వల్ల ఆమె కేవలం ప్రచార కర్తగానే కనిపించారు. అయితే ఇప్పుడు ఆమెకు ప్రముఖమైన పదవి కట్టబెట్టడం ద్వారా ఎన్నికల్లో ఆమె ప్రభావాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడినట్లు అర్థమవుతోంది.

మరి ప్రియాంక గాంధీ ప్రభావం 2019 ఎన్నికలలో ఏ విధంగా ఉంటుందో, ఉత్తరప్రదేశ్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందో తెలియాలంటే మరి కొన్ని నెలలు వేచి చూడాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close