మేఘా కంపెనీకి పీవీ రమేష్ రాజీనామా – ఇక ప్రెస్ మీట్ !

మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నుంచి తాజాగా రాజీనామా చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందని పెట్టిన కేసులు.. తాను అప్రూవర్ అంటూ జరుగుతున్న ప్రచారంపై మీడియాతో మాట్లాడనున్నారు. సోమవారం ఆయన ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన ఇప్పటికే సలహాదారుగా ఉన్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో ఆయన తన ఉద్యోగానికి నిన్ననే రాజీనామా చేశారు. ఇవాళ ప్రెస్ మీట్ పెడతానని ఆయన సోమవారం చెప్పారు.

ఉద్యోగానికి రాజీనామా చేసినందున ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాల ఉన్నాయి. ప్రైవేటు సంస్థకు చేసిన రాజీనామా కావడంతో పీవీ రమేష్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఓ సీనియర్ జర్నలిస్టు చేసిన ట్వీట్‌ను షేర్ చేసి తన అభిప్రాయం చెప్పారు. ఆ ట్వీట్‌లో ఆయనను మేఘా సంస్థ రాజీనామా చేయమని కోరిందని ఉంది. అయితే అలా కోరలేదని తానే రాజీనామా చేశానన్న అర్థంలో ట్వీట్ చేశారు. పీవీ రమేష్ రిటైరైన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నారు. కరోనా సమయంలో కీలకంగా పని చేశారు. అయితే తర్వాత ఆయన పదవీ కాలాన్ని పొడిగించలేదు.

కారణం ఏదైనా ఆయన బయటకు వచ్చేసిన తర్వాత మేఘా సంస్థలో చేరారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. ఆ సంస్థ కే రివర్స్ టెండర్లలో పోలవరం ప్రాజెక్టు సహా అనే ప్రాజెక్టులు దక్కాయి. ఏపీ ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆ సంస్థలో పని చేస్తూ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో తన వాదన వినిపించడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close