రాహుల్ “లారీ” ప్రయాణం వైరల్ !

అది హరియానాలోని అంబాలా – చండీగఢ్ హైవే. హఠాత్తుగా తెల్ల గడ్డంతో ఉన్న ఓ వ్యక్తి ఓ లారీని ఆపాడు. ఆ లారీలో చండీగఢ్ వరకూ వస్తానని ఎక్కాడు. ఆ లారీ డ్రైవర్ కూడా ఎక్కించుకున్నారు. కానీ కాసేపటికే ఆ డ్రైవర్‌కు ఎక్కిన వ్యక్తి్ ఎవరో తెలిసిపోయింది. ఆయనెవరంటే రాహుల్ గాంధీ. అవును కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీనే. ట్రక్ డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు రాహల్ గాంధీ స్వయంగా ప్రజల్లోలికి వెళ్లారు. సోమవారం రాత్రి హరియాణా ని అంబాలా నుంచి చండీగఢ్‌ వరకు ట్రక్కులో ప్రయాణం చేశారు.

రాత్రిపూట ప్రయాణ సమయంలో భారీ వాహనాల డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు రాహుల్‌ ఇలా ట్రక్కులో ప్రయాణం చేసినట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. రాహుల్‌ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్న సిమ్లాకు వెళ్తున్న సమయంలో ఇలా ట్రక్‌లో ప్రయాణించినట్లుగా చెబుతున్నారు. ప్రత్యేకంగా ప్లాన్ చేసింది కాకపోవడంతో చూసిన వారు తీసిన ఫోటోలు, వీడియోలు మాత్రమే వైరల్ అవుతున్నాయి.

రాహుల్ గాంధీ భిన్నమైన నాయకుడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు. త్వరలో మరోసారి పాదయాత్ర చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. తరచూ ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆయన భిన్నమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇవి ప్రజల మనసుల్ని చూరగొనేలా చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

వైసీపీ ఘోర పరాజయం ఖాయం – జగన్‌కు ఎప్పుడో చెప్పా : ప్రశాంత్ కిషోర్

ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ తన అంచనాను మరోసారి చెప్పారు. వైసీపీ ఘోర పరాజయం ఖాయమని అన్నారు. ఈ విషయాన్ని తాను ఏడాదిన్నర కిందటే జగన్ కు చెప్పానని స్పష్టం చేశారు. ఆర్టీవీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close