బ్ర‌హ్మాస్త్ర వెనుక రాజ‌మౌళి

బాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న బ్ర‌హ్మాస్త్ర పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ణ‌బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్ కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రంలో టాలీవుడ్ నుంచి నాగార్జున కూడా చోటు సంపాదించుకున్నారు. ఈ సినిమా 3 భాగాలుగా రూపుదిద్దుకుంది. 2022 సెప్టెంబ‌రు 9న ప్ర‌పంచ వ్యాప్తంగా పార్ట్ 1 విడుద‌ల కానుంది. ద‌క్షిణాది భాష‌ల్లో ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి స‌మ‌ర్పకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన టెక్నిక‌ల్ విష‌యాల్లో కూడా రాజ‌మౌళి పాత్ర ఉంది. `బ్ర‌హ్మాస్త్ర‌`ని విజువ‌ల్ వండ‌ర్ గా తీర్చిదిద్ద‌డానికి చిత్ర‌బృందం ప్ర‌యత్నిస్తోంది. ఈ ప్రాజెక్టుపై దాదాపుగా 700 కోట్లు వెచ్చిస్తోంది. దీనికి సంబంధించిన గ్రాఫిక్స్ విష‌యంలో చిత్ర‌బృందం రాజ‌మౌళి స‌ల‌హాలు తీసుకుంటోంది. ఈ చిత్ర ప్రారంభానికి ముందే ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ రాజ‌మౌళిని ప‌లు సంద‌ర్భాల్లో క‌లిశాడు. ఈ సినిమాని ఎలా తీయాలి? విజువ‌ల్ గా ఏ రేంజ్‌లో ఉండాలి? అనే విష‌యాల‌పై రాజ‌మౌళి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకున్నాడు. బ్ర‌హ్మాస్త్ర టీమ్ లో క‌ర‌ణ్ జోహార్ రాజ‌మౌళిని లాక్కొచ్చాక‌… రాజ‌మౌళి ప్ర‌మేయం మ‌రింత‌గా పెరిగింది. ప్ర‌పంచ వ్యాప్తంగాఉన్న విజువ‌ల్ ఎఫెక్ట్స్ కంపెనీలు, అందులోని సాంకేతిక‌త‌… ఇవ‌న్నీ రాజ‌మౌళికి బాగా తెలుసు. అందుకే బ్ర‌హ్మ‌స్త్ర టీమ్ రాజ‌మౌళి స‌ల‌హాల్ని అందుకోవ‌డానికి ముందుకొచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో ఆయ‌న్ని భాగ‌స్వామిగా చేర్చింది. రాజ‌మౌళి పేరు త‌మ పోస్ట‌ర్ పై ఉండ‌డం త‌మ అదృష్ట‌మ‌ని క‌ర‌ణ్ జోహార్‌, అయాన్ ముఖ‌ర్జీ అన్నారంటే… రాజ‌మౌళి ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ధర్మాన చెప్పింది అబద్దమని తేల్చిన జగన్

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి.. రెవిన్యూ మంత్రి వేర్వేరుగా స్పందిస్తున్నారు. ఇద్దరూ ఒకటే మాట్లాడితే ఏ సమస్యా ఉండదు. కానీ ఇద్దరూ వేర్వేరుగా ప్రకటిస్తున్నారు. మంత్రి ధర్మాన చట్టం అమలు...

ఫేక్ పోస్టులు , కేసుల చుట్టూ తెలంగాణ రాజకీయం !

సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్లుగాఫేక్ చేసుకుంట ఒకరిపై ఒకరు బురద చల్లుకోడానికి చేస్తున్న రాజకీయం తెలంగామణలో కేసులు, అరెస్టుల వరకూ వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వీడియోను ట్విస్ట్...

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close