వర్మ దిగజారుడికి హద్దే లేదు !

రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడిన అందులో సంచలనం, వివాదం వుండేలా జాగ్రత్తపడతాడు. ఆయన సినిమాలు తీయడం మానేసి చాలా కాలమైనప్పటికీ ఆయన్ని ఇంకా వార్తల్లో వుంచేది ఈ సంచలనాలే. అయితే ఆయన మాటలు రానురాను మరీ రోత పుట్టిస్తున్నాయి. సమయం సందర్భం లేకుండా ఎప్పుడూ ఒకటే ధ్యాసగా ఆయన చేస్తున్న కామెంట్స్ కంపరం పుట్టిస్తున్నాయి. తాజాగా గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్ 2023 ఈ వెంట్‌కు వర్మ ముఖ్య అతిథిగా వెళ్ళాడు వర్మ.

వర్సిటీలో ప్రసంగంలో కూడా వర్మ వరస మారలేదు. తినండి, తాగండి, ఎంజాయ్‌ చేయండి.నేను చనిపోయాక స్వర్గానికి వెళ్తే అక్కడ రంభ, ఊర్వశీలు ఉండకపోవచ్చు. అందుకే ఆ చాన్స్‌ తీసుకోకుండ ఇక్కడే అన్ని అనుభవించేస్తా. రంభ, ఊర్వశీ, మేనకలతో తిరిగినప్పుడే మోక్షం కలుగుతుంది. వైరస్‌ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలి’’ ఇలా సాగింది వర్మ ప్రసంగం. వర్మ వ్యాఖ్యలకు అక్కడే వున్నా మహిళా లెక్చరర్లు, విద్యార్ధులు సిగ్గుతో తల దించుకున్నారు.

అసలు ఇలాంటి వేడుకలకు రామ్ గోపాల్ వర్మ లాంటి పర్వర్ట్ ని ఎవరు ఆహ్వానించారు ? నిర్వాహకులకు మతిపోయిందా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ ని క్రియేటీవ్ జీనియస్ అనే కోవలో చేర్చి ఈ వేడుకకు పిలిచారు నిర్వాహకులు. వేడుకలో ఆయన చెప్పిన మాటలు విని నిర్వాహకులు కూడా విస్తుపోయారు. రామ్ గోపాల్ వర్మ ఈ కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. అనేక సార్లు యూట్యూబ్ ఇంటర్వ్యూ లు, పేస్ బుక్, ట్విట్టర్ లలో ఇదే వాగుడు వాగాడు వర్మ. ఇప్పుడు యూనివర్శిటీ విద్యార్ధుల ముందుకు కూడా అరిగిపోయిన రికార్డ్ లా పిచ్చి వాగుడు వాగి తన దిగజారుడుతనానికి హద్దే లేదని నిరూపించుకున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close