రమణదీక్షితులకు అరెస్ట్ భయం – హైకోర్టులో పిటిషన్ !

శ్రీవారి సేవలో నిత్యం గోవింద గోవింద అంటూ పారాయణం చేస్తూ తన్మయత్వంతో జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిన రమణదీక్షితులు కుట్ర పూరిత ఆలోచనలతో చేసిన కొన్ని తప్పుల వల్ల.. ఎవరి మేలు కోసం చేశారో వారే ఇప్పుడు జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత బతుకు బతికి.. ఇప్పుడు ఆయన జైలుకు వెళ్లకుండా ఉండేందుకు.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా ఉండేందుకు .. న్యాయస్థానాల బాట పడుతున్నారు.

ఇటీవల టీటీడీపై… ఈవోపై అనేక ఆరోపణలు చేస్తున్న రమణదీక్షితులు వీడియో సోషల్ మీడియాలో వైరైల్ అయింది. దీనిపై టీటీడీ కేసు పెట్టింది. ఆయనను పదవి నుంచి తొలగించింది. పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇస్తున్నారు. హాజరు కాకపోతే అరెస్టు చేసే అవకాశం ఉంది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. తనను ఇంటి దగ్గరే విచారించాలని.. అరెస్టు చేయవద్దని ఆయన కోరుతున్నారు. ఈ పిటిషన్ విచారణ జరగాల్సి ఉంది.

2019 ఎన్నికలకు ముందు రమణదీక్షితుల ప్రధాన అర్చకులుగా మొత్తం ఆలయంపై పెత్తనం చేసేవారు. ఎవరితో కుట్రలు చేశారో కానీ.. చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ… చెన్నై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ప్రెస్‌మీట్లు పెట్టారు. పింక్ డైమాండ్, పోటు తవ్వకాలు అంటూ అడ్డగోలు ఆరోపణలు చేశారు. దీంతో ఆయనకు ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రకటించింది. తర్వాత లోటస్ పాండ్‌కు వెళ్లి … జగన్ సీఎం గానే మళ్లీ పాత పదవి వచ్చేలా హామీ తెచ్చుకున్నారు. కానీ ఐదేళ్లుగా ఆయన నరకం అనుభవిస్తున్నారు. మధ్యలో సలహాదారు పదవి ఇచ్చినా… ఇప్పుడు తీసేసి కేసులు పెట్టారు. చివరికి ఏమవుతుందో కానీ.. శ్రీవాసి సేవలో నిమగ్నం కావాల్సిన అర్చకుడు ఇలా తప్పుుడు ఆలోచనలు చేసి.. మానసిక క్షోభకు గురవడం మాత్రం.. చాలా మంది గుణపాఠంలా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని ప్రచారం… షెడ్యూల్ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్న మోడీ రాజ్ భవన్ లో బస చేశారు....

నిర్లక్ష్యమే ముంచింది…కాళేశ్వరంపై నిపుణుల మధ్యంతర నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి సూచించింది.వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని...

పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ – విప్లవమే !

ఐదేళ్ల పాలనలో తాను చాలా విప్లవాలు తెచ్చానని జగన్ రెడ్డి చెబుతూ ఉంటారు. విప్లవం అంటే ఆ రేంజ్ అనుకుంటున్నారో కానీ ఆయన కానీ ఆయన రచయితలు కానీ ఆ పదాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close