చైతన్య : థూ..! ఏపీకి ఈ గతి పట్టిందేంటి !?

ఆంధ్రప్రదేశ్ అంటే తెలివిగలవాళ్లు ఉండే రాష్ట్రం అని అనుకునేవారు. దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో ఆంధ్ర వాళ్లు ఉన్నారని లెక్కలు చెప్పుకునేవాళ్లు. ఇప్పుడు నిన్నగాక మొన్న విడిపోయిన తెలంగాణ వాళ్లు కూడా ఏపీని చూసి జాలి పడుతున్నారు. విడిపోయి మంచిదయిందని సంతోషపడుతున్నారు. ఇలాంటి పాలకులు ఉమ్మడి ఏపీలో వచ్చి ఉంటే తెలంగాణకు కూడా ఆ ” సిగ్గు.., లజ్జ” లేని రాష్ట్రం ఇమేజ్ వచ్చి ఉండేదని సోషల్ మీడియాలో హమ్మయ్య అనుకుంటారు.

ఆంధ్ర అనే పదానికి పవిత్ర అర్థాన్ని తుడిచేశారు !

రాజకీయం అంటే వ్యక్తిత్వ హననం చేయడమే అన్నట్లుగా సాగిపోతున్న రాజకీయం గత రెండున్నరేళ్లుగా ఎంతో మందిని చంపేసింది. కోడెల శివప్రసాదరావును ఆత్మహత్య చేసుకునేందుకు దారుణమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఎంతో మంది నేతలు నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అలా తిడితేనే అక్కడి ప్రభుత్వాధినేతకు కడుపు నిండుతుంది.. తన కడుపు నింపిన వారికి ఆయన కడుపు నింపుతారు. అంతే ఇంక కావాల్సింది ఏముంది. రాజకీయ ప్రత్యర్థులపై తిట్లతో విరుచుపడటమే. అది పవన్ కల్యాణ్ అయినా…చంద్రబాబు అయినా అంతే. ఆ తిట్లు తిట్టి అక్కడి నేతలు పదవులు పొందాలని ఎలా అనుకుంటున్నారో కానీ.. అలాంటి మాటలు ఎదుటి వ్యక్తులకు కూడా వస్తాయని వారు కూడా అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నారు.

మీ పిల్లలు మీకే పుట్టారా అని చర్చ పెట్టిన గొప్ప రాజకీయం !

నీ పిల్లలు నీకే పుట్టారా అని ఎవరినైనా అడిగితే అది ఆ మగాడ్ని తిట్టినట్లు కాదు. ఆ ఇంటి ఆడపడుచును తిట్టినట్లు. ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసినట్లు. వల్లభనేని వంశీ అనే ఓ ఎమ్మెల్యే దీన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ కుటుంబం అండతో టీడీపీలో టిక్కెట్ దక్కించుకుని ఆ కుటుంబంలోని ఆడ పడుచునే కించ పరిచేలా మాట్లాడారు. అక్కడ్నుంచి అసెంబ్లీకి తీసుకు వచ్చారు. అంతే రాష్ట్రం పరువు పోయింది. అసెంబ్లీలో జరిగిన జుగుప్సాకరమైన పరిణామాలు అందరూ…”ధూ” అని ఊసేలా చేస్తున్నాయి. ఇప్పుడు పోటీగా ఆ మాటలు అన్న నేతల కుటుంబసభ్యులను సోషల్ మీడియాలో పెడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. వాళ్ల పిల్లలు ఫోటోలు పెట్టి వాళ్లకే పుట్టారా.. అని అసభ్యంగా మాట్లాడుతున్నారు. రాజకీయం కోసం కుటుంబాల్ని అత్యంత అసభ్యంగా సోషల్ మీడియాకు ఎక్కించుకునే దౌర్భాగ్య నేతలు అందర్నీ “థూ” అంటున్నారు. కానీ నేతలు తుడిచేసుకుంటున్నారు.

వంద శాతం ఈ తప్పు ఆంధ్రులదే..వారే అనుభవించాలి !

ఆంధ్రప్రదేశ్ ఈ దౌర్భాగ్యానికి కారణం నిస్సందేహంగా ప్రజలే. అద్భుతమైన రాష్ట్రంగా ఎదుగుతుందని ఎంతో మంది విశ్లేషణ చేశారు. కష్టపడే ప్రజలు ఆలోచన ఉన్న నాయకులు అని నిన్నామొన్నటి దాకా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వారి అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఏపీ ఉన్న దుస్థితికి కారణం వంద శాతం ప్రజలే. చేసిన తప్పేంటో.. చేయకూడదని తప్పేంటో ఇప్పటికీ వారు తెలుసుకోలేకపోతున్నారు. వారు రెండు వైపులా చీలిపోయి.. తాము ఎంత మురికి గుంటలో ఉన్నామో తెలుసుకోలేకపోతున్నారు. ఏపీ ప్రజల వినాశనాన్ని కోరుకుంటున్న వారు రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు. అందుకే ఎవరూ ఎవర్నీ నాశనం చేయరు.. చేయలేరు.. ఎవరికి వారు నాశనం చేసుకోవాల్సిందే. ఏపీది ఇప్పుడు అదే పరిస్థితి. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close