అమరావతి కోసం వాయిస్ పెంచుతున్న ఆర్ఆర్ఆర్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. అమరావతి విషయంలో తన పార్టీ విధానానికి పూర్తి భిన్నమైన దారిని ఎంచుకుని అగ్రెసివ్‌గా ముందుకెళ్తున్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ.. ఆయన నేరుగా రాష్ట్రపతికి వినతి పత్రం కూడా సమర్పించారు. కేంద్ర బలగాలతో రక్షణ కోసం విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్రపతిని కలిసిన రఘురామకృష్ణరాజు.. అమరావతి అంశంపైనే ఎక్కువగా మాట్లాడినట్లుగా ప్రకటించారు. తన భద్రత విషయమే కాకుండా.. విడిగా ప్రత్యేకంగా అమరావతి కోసం.. లే్ఖ ఇచ్చినట్లుగా చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అమరావతి ఉండాల్సిందేనని రఘురామకృష్ణరాజు అంటున్నారు. తాము అమరావతి ఇల్లు, ఆఫీసు కట్టుకున్నానని చెప్పి.. అందర్నీ నమ్మించిన జగన్ ఇప్పుడు .. మూడు రాజధానులకు మడమతిప్పడం మంచిది కాదంటున్నారు.

ప్రజలంతా అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని తాను రాష్ట్రపతికి చెప్పానని.. ఎంపీ ప్రకటించారు. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు చట్ట విరుద్ధంగా గవర్నర్ వద్దకు పంపారని.. రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏ కులాన్నైతే ద్వేషిస్తుందో.. ఆ కులం వారికంటే ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ వాళ్లే ఎక్కువ భూములిచ్చారని.. వాళ్ల కోసమైనా అమరావతిని కొనసాగించాల్సి ఉందన్నారు. ప్రజలందరూ అమరావతినే రాజధానిగా కొనసాగేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రాత్రికి రాత్రి రాజధాని విశాఖ వెళ్లిపోయినా .. పోరాడి అమరావతే రాజధానిగా ఉండేలా కృషి చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడు రఘురామకృష్ణరాజు.. పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అలాగని సానుకూలంగా కూడా ఎక్కడా మాట్లాడలేదు. ఇటీవల పార్టీతో విబేధాలు వచ్చిన తర్వాత మెల్లగా మూడు రాజధానులకు మద్దతు తెలుపుతున్నా.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మాత్రం… అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు.. తన డిమాండ్‌కు మరింత బలం ఇస్తూ.. రాష్ట్రపతికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఇక నుంచి రఘురామకృష్ణరాజు.. రాజధాని విషయంలో ప్రభుత్వానికి మరింత చికాకు తెప్పించే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close