యార్లగడ్డ వెళ్లిపోయాక సజ్జల రెడ్డి కవరింగ్ !

అమెరికా నుంచి తీసుకొచ్చి జగన్ రెడ్డి క్రాస్ రోడ్స్ లో వదిలేశారని బాధపడ్డ యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. చాన్స్ ఇస్తే టీడీపీలో చేరుతానని మీడియా ముఖంగా చంద్రబాబుకు చెప్పారు. అనుచరులతో మరోసారి సమవేశం అయిన యార్లగడ్డ.. తాను పార్టీకి ఎంతో సేవ చేసినా సజ్జల రెడ్డి పోతే పో అనడం బాధించిందన్నారు. మూడేళ్లుగా తనను అవమానిస్తున్నారని.. పోతే పో అనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రెండు రోజులకిందట సజ్జల రామకృష్ణారెడ్డి.. యార్లగడ్డ విషయంలో ఉంటే ఉండొచ్చ.. పోతే పోవచ్చు.. ఎవరికైనా స్వేచ్చ ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే యార్లగడ్డ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత స్పందించారు. పోతే పో అని ఎవ్వరు అన్నారని తాడేపల్లిలో ఎదురు ప్రశ్నించారు. టికెట్ లేదని బహిరంగంగా చెప్పలేదని స్పష్టం చేశారు. ఒక్కరికే అవకాశం అనే యాంగిల్ లో తాను మాట్లాడానన్నారు. అయితే ఇలాంటి చర్చలు అంతర్గతంగా జరగాలని.. అంతే కాని బయట మాట్లాడ్డం మంచిది కాదని సూచించారు. యార్లగడ్డ విషయం లో ఇదే చెప్పానని కవర్ చేసుకున్నారు. కానీ సజ్జల టార్గెట్ .. గన్నవరంలో ఎవరో ఒకర్ని బయటకు పంపడం.. వంశీని ఇప్పుడు బయటకు పంపలేరు. టిక్కెట్ నిరాకరించలేరు. ఆయనను అలా వాడుకున్నారు. అందుకే వెంకట్రావుకు పొగ పెట్టారు. వైసీపీలో చాలా మంది నేతలకు ఇదే ట్రీట్ మెంట్ ప్లాన్ చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడ్డారా లేదా.. ఖర్చు పెట్టుకున్నారా లేదా అన్నది కాదు ముఖ్యమని..ఇప్పుడు ఉపయోగపడతారా లేదా అన్నదే కీలకమని చెబుతున్నారు. సజ్జల రెడ్డి నోటి దురుసుగా మాట్లాడుతున్నారో.. వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారో కానీ చాలా మంది వైసీపీ నేతలు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close