జగన్ పోలవరం వెళ్లి పునాదులు లేపబోతున్నారా..?

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక .. ఇప్పుడు విశ్వరూపం చూపించే ప్రయత్నాల్లో ఉంది. గత పదేళ్లుగా.. వైఎస్ జగన్‌కు వ్యతిరేక పార్టీలపై… కావాల్సినంత… వ్యతిరేక ప్రచారం చేసినా.. ఇప్పుడు మిషన్ మారింది. ఓ వైపు జగన్ సీఎం గా ఉన్నారు.. మరో వైపు.. నిన్నమొన్ననే అధికారం కోల్పోయిన పార్టీ ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీ చేసిన పనులన్నింటినీ… అసలు జరగలేదని చెప్పి.. ఇప్పుడు జగన్ వచ్చి.. చిటికెలో వాటినన్నింటినీ… సర్దేశాడని చెప్పడానికి.. అసలైన విశ్వరూపం చూపించబోతోంది. అందులో భాగంగా.. ఈ రోజు మిషన్ పోలవరం ప్రాజెక్ట్ ను ఎత్తుకుంది. ఆ ప్రాజెక్ట్ ఇంకాపునాదుల్లోనే ఉందని తేల్చేస్తూ.. కథనం రాసి పడేశారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల ప్రచారంలో.. పోలవరం ప్రాజెక్ట్ ఇంకాపునాదుల్లోనే ఉందని చెప్పేవారు. నిజానికి ఆయన ఐదేళ్ల కాలంలో.. ఎప్పుడూ పోలవరం ప్రాజెక్ట్ ను చూడలేదు. పాదయాత్ర.. గోదావరి జిల్లాలకు వచ్చినా ఆయన అటు వైపు వెళ్లలేదు. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు చేసినా డోంట్ కేర్ అన్నారు. ఇప్పుడు సీఎం హోదాలో.. తొలి సారి పోలవరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్తున్నారు. అందుకే సాక్షి పత్రిక గ్రౌండ్ వర్క్ చేసింది. పునాదులు కూడా.. పడలేదని.. తీర్మానించి కథనం రాశారు. 70 శాతం పూర్తయిందని.. గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని.. కానీ అక్కడ పునాదులే లేవన్న అర్థంలో ప్రచారం ప్రారంభించారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ రోజు పోలవరం పర్యటన తర్వాత… ఆయన ఇచ్చే ఆదేశాలతో.. పోలవరం ప్రాజెక్ట్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆయన అడుగు పెట్టగానే.. ప్రాజెక్ట్ కు ఓ రూపం వస్తుంది. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో.. ఆ ప్రాజెక్ట్‌ను నాశనం చేస్తే.. జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజులోనే.. దాన్ని సరిదిద్ది వస్తారు. ఇప్పటికే.. ప్రమాణస్వీకారం చేయక ముందే ఢిల్లీకి వెళ్లి… పోలవరానికి కావాల్సిన అన్ని అనుమతుల కోసం ప్రయత్నించి వచ్చారు. ఇక నుంచి పనులు పరుగులు పెట్టబోతున్నాయని.. సాక్షి చెబుతోంది. నిన్నటిదాకా పునాదుల్లో ఉన్న పనులు.. ఈ రోజు సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని.. 70 శాతానికి చేరుకునే అవకాశం ఉందని.. సాక్షి నేరుగా చెబుతోందన్నమాట. ఎంతైనా.. సాక్షి మార్క్ జర్నలిజాన్ని… ఎవరూ అంచనా వేయలేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close