బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ హయాంలో గురుకులాల సెక్రటరీగా వ్యవహరించి అనేక అక్రమాలకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి. ఆయన చేసిన ఈ ఆరోపణలు ఆషామాషీగా చేయలేదు. కాగ్ నివేదికలోని అంశాలను ముందుంచి ఆర్ఎస్పీ అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. సామ బయటపెట్టిన ఈ విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
గురుకులాల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు కోడింగ్ నేర్పించడానికి సంవత్సరానికి ఆర్ఎస్పీ నాలుగు కోట్లు ఖర్చు పెట్టారన్న సామ.. 240మంది స్టూడెంట్స్ కు కోడింగ్ నేర్పిస్తే 4కోట్లు అవుతాయా అని ప్రశ్నించారు. మూడు సంస్థలతో కోడింగ్ కోచింగ్ నేర్పిస్తామని, రెండు సంస్థలకు పర్మిషన్ తీసుకున్నారని చెప్పారు.
ఇది మాత్రమే కాదు.ఐఐటీ జేఈఈ ఆన్ లైన్ కోర్సుల పేరిట కూడా 20కోట్లు ఖర్చు పెట్టారని కాగ్ తెలిపింది. దానికి ఆర్థిక శాఖ అనుమతి లేదని, దీన్ని అవినీతి అనకుండా మరేమి అంటారని ప్రశ్నించారు. స్కూల్ యూనిఫాం , దుప్పట్ల పేరిట కూడా అవినీతి చేశారని ఆరోపించారు. దీనిపై తెలంగాణ సర్కార్ విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు సామ రామ్మోహన్ రెడ్డి.