త్రివిక్రమ్ కి ఓ అలవాటు ఉంది. తన సినిమాల్లో హీరోయిన్పాత్రకు చెల్లాయో, అక్కనో తగిలిస్తాడు. జల్సా, అత్తారింటికి దారేది, అరవింద సమేత చిత్రాల్లో ఈ సెంటిమెంట్ ని ఫాలో అయ్యాడు. ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం కూడా ఇదే పంథాలో వెళ్తున్నాడు. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ని కథానాయికగా ఎంచుకున్నారు. పూజా సోదరి పాత్రలో.. సంయుక్త మీనన్ కనిపించనుందట. తమిళ, మలయాళ చిత్రాల్లో సంయుక్త మీనన్ మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం…. భీమ్లా నాయక్లో నటిస్తోంది. ఆ సినిమాలో సంయుక్త నటనకు త్రివిక్రమ్ ముగ్థుడయ్యాడని టాక్. దాంతో మహేష్సినిమాలోనూ తనకో పాత్ర దక్కింది. ఇటీవల దుబాయ్లో ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చలు జరిగాయి. దుబాయ్లో… త్రివిక్రమ్, మహేష్లు కలుసుకున్న సంగతి తెలిసిందే. అక్కడే ఫైనల్ నేరేషన్ కూడా జరిగిపోయిందని, స్టోరీని లాక్ చేసేశారని టాక్. సంక్రాంతి తరవాత మొదలవ్వాల్సిన సినిమా ఇది. మహేష్ కి కరోనా సోకడం, రమేష్ బాబు మరణంతో.. ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యం అయ్యింది. ఏప్రిల్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టి, 2023 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.