కోర్టులో తననే బలి చేస్తున్నారని శ్రీలక్ష్మి అసంతృప్తి !?

సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఇక కోర్టు కేసుల్లో తన పేరు ఉండకుండా చూసుకోవాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు సూటిగానే చెప్పారన్న ప్రచారం సెక్రటేరియట్ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలు పాలయి.. కోర్టుల చుట్టూ తిరుగుతూంటే.. కొత్తగా ప్రభుత్వ నిర్ణయాల వల్ల శిక్షలకు గురి కావాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సేవా శిక్షను ఆమె అనుభవించాల్సి వస్తోంది. కోర్టు నిర్ణయాలను అమలు చేయకపోవడం వల్ల పడిన శిక్ష అది.

నిజానికి కోర్టు నిర్ణయాలను అమలు చేయడం అధికారులకు పెద్ద పని కాదు.కానీ ప్రభుత్వం వద్దంటోంది. అలా వద్దనడం వల్ల అధికారులు బలవుతున్నారు. చాలా మంది తప్పించుకుంటున్నారు. కానీ కొంత మంది మాత్రం ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం సరే అంటున్నారు. అమరావతి కేసుల్లోనూ శ్రీలక్ష్మినే ప్రధానంగా బాధ్యుల్ని చేసి అఫిడవిట్లు వేస్తున్నారు. ఆమె లేనప్పుడు మాత్రమే వేరేవారికి అఫిడవిట్లు వేయాలని ఆదేశాలిచ్చారు. కానీ ఇప్పుడు తన పేరుతో అసలు అమరావతి అఫిడవిట్లు వద్దని ప్రభుత్వ పెద్దలకు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆమె ఖరాఖండిగా చెప్పడంతో ఇప్పుడు ఆమెకు బదులుగా వేరే వారి పేర్లతో అమరావతి అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు.

అమరావతి విషయంలోనూ రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఉద్దేశపూర్వకంగా అమలు చేయడం లేదని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం కూడా… హైకోర్టుతీర్పును పాటించడం ఇష్టం లేకపోయినా పాటిస్తానన్నట్లుగా ఒక్కో అడుగు వేస్తోంది . కోర్టు ఆదేశాలపై నిర్లక్ష్యాన్ని న్యాయస్థానాలు అసలు సహించడం లేదు. దీంతో ఆ విషయంలోనూ తనకు ఇబ్బందులు ఎదురవుతాయేమోనని శ్రీలక్ష్మి నిర్మోహమాటంగా తనకు అమరావతి అఫిడవిట్లతో సంబంధం లేదని తేల్చేసినట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close