షర్మిల పరామర్శ యాత్ర మళ్ళీ షురూ!

షర్మిల ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి తెలంగాణాలో పరామర్శయాత్రలు చేస్తున్నారో తెలియదు కానీ అపుడప్పుడు వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. జనవరి 3 నుంచి నాలుగు రోజులపాటు ఆమె మెదక్, నిజామాబాద్ జిల్లాలలో పరామర్శయాత్ర చేపట్టబోతున్నారని ఆ పార్టీ తెలంగాణా ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ నిన్న ప్రకటించారు. జనవరి 3వ తేదీన మెదక్ జిల్లా గజ్వేల్ లో పరామర్శ యాత్ర మొదలుపెట్టి ఆ జిల్లాలో మూడు రోజులు పర్యటించి మొత్తం 13 కుటుంబాలను ఓదార్చుతారు. ఈసారి ఆమె జనవరి 5తేదీన నారాయణఖేడ్ లో బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నట్లు ఆ పార్టీ తెలంగాణా ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్ ప్రకటించారు.జనవరి 5,6 తేదీలలో ఆమె నిజామాబాద్ జిల్లాలో ఆమె పర్యటిస్తారు. ఆరవ తేదీ సాయంత్రం ఆమె హైదరాబాద్ లో తన సోదరుడు జగన్ లోటస్ పాండ్ నివాసానికి చేరుకొంటారు.

తను ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించి పరామర్శ యాత్రలు చేయడంలేదని షర్మిల చెప్పుకొంటునప్పటికీ, ఆమె యాత్రలను విజయవంతం చేయమని నల్లా సూర్యప్రకాశ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునీయడం వలన వాటిని రాజకీయ యాత్రలుగానే పరిగణించవలసి ఉంటుంది. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలని తాపీగా ఆరేళ్ళ తరువాత వెళ్లి ఓదార్చడం ఒక విచిత్రమనుకొంటే, ఆ ఓదార్పు యాత్రని విజయంతం చేయాలని వైకాపా నేతలు పిలుపు ఇవ్వడం మరో విచిత్రం. సాధారణంగా ఏదయినా ఒక రాజకీయ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తున్నప్పుడు దానిని విజయవంతం చేయమని ప్రజలకు, పార్టీ నేతలకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేయడం వింటాము. కానీ చనిపోయిన ఒక వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఏమిటో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

నాటి టీడీపీ పరిస్థితే నేడు వైసీపీది !

2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జాతీయ సర్వేలు వచ్చాయి. ఆ సర్వేలన్నింటిలో.. వైసీపీ భారీ విజయం సాధించబోతోందని అంచనా వేశాయి. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అవన్నీ పెయిడ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close