సోనూసూద్ సాయం పొందడమే ఆ దళిత రైతుకు శాపం..!?

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన దళిత రైతు నాగేశ్వరరావుకు సోనూసూద్ సాయం చేశారు. ఇక్కడ ప్రభుత్వానికేం సంబంధం లేదు. ఆయన కుమార్తెలతో కలిసి కాడి దున్నుతున్న వీడియో వైరల్ కావడం.. అది సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో సాయం చేశారు. కానీ.. ఎందుకో కానీ… అది ప్రభుత్వానికి నచ్చలేదు. ఆయన కడు పేదవాడు కాదని.. ఆయన చరిత్రను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కొంత మంది అధికారులు.. ఆయన ఇంటికి వెళ్లారు. ఇల్లు మొత్తాన్ని పరిశీలించారు. ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత అధికారులు.. ఆ రైతుకు ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయని… ప్రకటించారు. అమ్మఒడి పది వేలు.. రైతు భరోసా నిధులు వచ్చాయన్నారు. వైసీపీకి చెందిన కొంత మంది… ఆయన పేదవాడు కాదని.. 2009లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారని.. విమర్శలు ప్రారంభించారు.

సోషల్ మీడియాలో ఆయనపై ఒక్క సారిగా దాడి పెరగడంతో… దళిత రైతు నాగేశ్వరరావు మనస్తాపానికి గురయ్యారు. అధికారులు వచ్చి విచారణ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. తాము ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడామా అని ప్రశ్నించారు. ఎక్కడో ముంబైలో ఉన్న సోనూసూద్ సాయం చేస్తే… ఇక్కడ ఎందుకు తనపై దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. కొంత మంది తాము లావుగా ఉన్నామని.. శరీర రంగు గురించి మాట్లాడుతున్నారని… పేదరికాన్ని అలా కొలుస్తారా అని ప్రశ్నించారు.

దళిత రైతు నాగేశ్వరరావు ఉదంతం.. జాతీయ స్థాయిలో కలకలం రేపడంతో.. ప్రభుత్వం.. అది తమకు షేమ్ అని ఫీలయిందేమో కానీ… ఆయన పేదవాడు కాదని చెప్పేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే.. నాగేశ్వరావు కాస్త చదువుకున్న అభ్యుదయ భావాలున్న వ్యక్తి. అదే ఆయన ఆస్తి. ఆయన సంపదపరుడేమీ కాదు. వ్యవసాయం కలసి రాదని.. మదనపల్లెకి వెళ్లి టీ కొట్టు పెట్టుకుని జీవిస్తున్నారు. ఇద్దరు కుమార్తెల్ని చదివించుకుంటున్నారు. అంతకుమించి ఆయనకు ప్రత్యేక ఆదాయవనరులు లేవు. పేద దళిత రైతు కాబట్టే.. ప్రభుత్వ పథకాలు కూడా ఆయనకు అందుతున్నాయి. దీన్నే… పెద్దగా చేసి.. ఆయన ఏదో సోనూసూద్‌ను మోసం చేసినట్లుగా.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విమర్శలు ప్రారంభించడంతో.. ఆయన మనస్థాపానికి గురయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close