వెంటిలేట‌ర్‌పై పోరాడుతున్న బాలు

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని డాక్ట‌ర్లు ధృవీక‌రించారు. ఆయ‌న ఇంకా వెంటిలేట‌ర్‌పైనే ఉన్నార‌ని, ప్ర‌స్తుతం ఎక్మో స‌పోర్ట్‌తో వైద్యం చేస్తున్న‌ట్టు డాక్ట‌ర్లు తాజా హెల్త్ బులిటెన్ లో తెలిపారు. బాలుకి వెంటిలేట‌ర్ తొల‌గించార‌ని, ఆయ‌న ఐసీయూ నుంచి సాధార‌ణ గ‌దికి వ‌చ్చార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ అవేం నిజం కాద‌ని, బాలు త‌న‌యుడు ఎస్‌.పి. చ‌ర‌ణ్ ఇది వ‌ర‌కే తెలిపారు. ఐసీయూలో చేరిన‌ప్ప‌టి నుంచీ, ఇప్ప‌టి వ‌ర‌కూ బాలు ఆరోగ్యంలో ఎలాంటి మార్పూ లేద‌ని వైద్యులు ధృవీక‌రించారు. అయితే తాము శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తూనే ఉన్నామ‌ని తెలిపారు. బాలు కోసం దాదాపు 12 మందితో కూడిన ప్ర‌త్యేక వైద్య‌బృందం అహ‌ర్నిశ‌లూ శ్ర‌మిస్తోంది. బాలు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని యావ‌త్ సినీ ప్ర‌పంచం ఒక్క‌టై ప్రార్థ‌న‌లు చేస్తోంది. రేపు.. అంటే గురువారం త‌మిళ సంగీత ప్ర‌పంచం అంతా బాలు కోసం సామూహిక‌ ప్రార్థ‌న‌లు చేయాల‌ని త‌మిళ చిత్ర‌సీమ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో నో క్యాష్ పాలసీ !

నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్...

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే ఏపీకి ఏం ఉపయోగం !?

విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి రాజధాని అంశానికి జూన్ రెండో తేదీన ముగింపు రాబోతోంది. మరోసారి పొడిగింపు అసాధ్యం అని తెలిసినా సరే కొంత మంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలనే...

డ్రగ్స్ పార్టీ కేసు వైసీపీ చుట్టే తిరుగుతోంది !

డ్రగ్స్ అంటే వైసీపీ పేరు ఖచ్చితంగా వస్తోంది. ఏదో ఆషామాషీగా మీడియాలో వచ్చే కథనాలు కాదు. నేరుగా పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నవారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏ 2గా నిలిచిన...

పల్లీబఠాణి కామెంట్స్‌తో రాకేష్ రెడ్డిని ముంచిన కేటీఆర్

బిట్స్ పిలానీ గొప్ప కావొచ్చు కానీ మిగతా గ్రాడ్యూయేట్స్ అంతా పల్లీ బఠాణీలు అంటే ఎలా ?. కేటీఆర్ ఇది ఆలోచించలేదు. ప్రాస బాగుంది కదా అని అనేశారు. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close