శ్రీలంక గుణపాఠం : గెలిపించింది..పాతరేస్తోంది ప్రజలే !

” ప్రజలు గెలిపించారు.. మాది ప్రజా ప్రభుత్వం అంటూ ఇష్టారీతిన పాలన చేసిన ప్రజల్ని పీక్కు తింటూ… అడ్డొచ్చిన వాళ్లను అడ్డగోలుగా బూతులుతో తిడతం.. లేదంటే కేసులతో లోపలేస్తాం.. మాకు ఎదురే లేదు .. మేము మగాళ్లం.. బతికున్నంత వరకూ అధికారం మాదే ” అని అధికార అహంకారంతో విర్రవీగే వారికి శ్రీలంక పరిస్థితులు.. ముందు ముందు తమకు ఎదురు కాబోయే పరిస్థితుల్ని కళ్ల ముందు కనిపించేలా చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నియంతలు.. రాజులు ఎప్పటికీ ఉండరు. ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత తమను తాము నియంతలుగా.. రాజులుగా భావిస్తే.. చివరికి ఆ ప్రజలే గోరీ కడతారు. దానికి శ్రీలంక పరిణామాలే సాక్ష్యం.

గెలిపించారని బతుకుల్ని నాశనం చేస్తే ప్రజలు ఊరుకుంటారా ?

ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న గోటబయ రాజపక్సే కానీ..రాజీనామా చేసిన మహింద రాజపక్సే కానీ ప్రజా నాయకులే. వాళ్లను ప్రజలే ఎన్నుకున్నారు. మహింద రాజపక్సే తమిళ ఈలంను అణిచి వేసి.. సింహాళుల్లో తిరుగులేని ఆదరణ తెచ్చుకున్నారు. వారు కూడా అంతే.. తమకు తిరుగులేదని విర్రవీగారు. ప్రతిపక్షాలను అణిచివేశారు. ప్రజలని ఆకట్టుకోవడానికి ఉచితాలిచ్చారు. దేశాన్ని తాకట్టు పెట్టేశారు. చివరికి ఏమయింది..? ప్రజలు తిరగబడి.. తమ ఇళ్లనే తగలబెడుతున్నారు. కనిపిస్తే.. చేతికి దొరికితే వారినీ తగలబెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఎంత తీవ్రంగా పరిస్థితి ఎందుకు మారింది ? గెలిపించిది కూడా ప్రజలే కదా !

గెలుపోటములు ప్రజలవే… రాజకీయ నేతలు తెలుసుకోవాల్సిందిదే !

ప్రజాస్వామ్యం గెలుపు అయినా భారీ గెలుపు అయినా పరిపాలన మాత్రం ప్రజల కోణంలోనే చేయాలి. అతి భారీ గెలుపు వచ్చిందని.. యాభై శాతం మంది ఓట్లేశాని.. విచ్చలవిడితనంగా పరిపాలన చేస్తే సీన్ మారిపోతుంది. వారే తిరుగుబాటు చేస్తారు. తాము ఏం చేసినా ప్రజల మద్దతు ఉందని.. ప్రజలు గొప్ప మెజార్టీ ఇచ్చారని చెప్పుకుంటే చివరికి ఆ ప్రజలే చితిమంటలు వేస్తారని శ్రీలంక ప్రజలు నిరూపిస్తున్నారు. ఎంతటి వ్యక్తులయినా ప్రజాగ్రహానికి తల వంచక తప్పదని తేలిపోయింది.

భారత్‌లో “నయా రాజులు, నియంతలు” శ్రీలంకను చూసైనా మారతారా ?

భారత్‌లో ప్రజాస్వామ్యం.. శ్రీలంక ప్రజాస్వామ్యం కన్నా విలువల పరంగా ఎప్పుడో దిగజారిపోయింది. ఓట్లు కొనుగోలు చేసే దౌర్భాగ్యం మన దేశంలోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ప్రజలు తిరగబడక ముందే పాఠాలు నేర్చుకోవాలి. కానీ విచిత్రం ఏమిటంటే అధికారం తలకెక్కిన ఎవరికీ … తాము భవిష్యత్‌లో ఓడిపోతామని అనుకోరు. అధికారం శాశ్వతం అనుకుంటారు. ప్రజల్ని పట్టించుకోరు. ఇప్పుడు దేశంలో చాలా మంది పాలకులది అదే పరిస్థితి. శ్రీలంకను చూసి అయినా మార్చుకోవాలి.. లేకపోతే. .అలాంటి పరిస్థితులే ఇక్కడ కనిపించినా ఆశ్చర్యం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close