నేర చరితుడని తెలిస్తే జనం ఓట్లేయకుండా ఉంటారా..?

సుప్రీంకోర్టు గురువారం నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేయడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణలో కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలన్నీ తమ తమ అభ్యర్థులపై పెండింగులో ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను ప్రచారంలోకి తీసుకురావాలని ఆదేశించింది. అధికారిక వెబ్‌సైట్లలో, సోషల్ మీడియాల్లో ఉంచాలని స్పష్టం చేసింది. నిజానికి గతంలోనే సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కానీ.. అమలులోకి రాలేదు. దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్‌ కేసులున్నవారిని అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేశారు? నేర చరిత్ర లేనివారికి టికెట్లు ఎందుకు ఇవ్వలేదు?.. అనే కారణాలను రాజకీయ పార్టీలు బయటపెట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

క్రిమినల్‌ కేసులు పెండింగులో ఉన్నా ఒక అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేశారో చెప్పేటప్పుడు కేవలం విజయావకాశాలే కాకుండా… వారి విద్యార్హతలు, సాధించిన విజయాలు, ప్రతిభాపాటవాల ప్రస్తావన తప్పకుండా ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించంది. ఎన్నికలలో పోటీ చేసే నేరచరితుల సంఖ్య పెరిగిపోతోందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం… అభ్యర్థి నేర చరితుడని తెలిసిన తర్వాత ప్రజలు ఆ అభ్యర్థిని ఎక్కునే విషయంలో.. ఆలోచిస్తారన్న అభిప్రాయంతో.. ఇలాంటి తీర్పు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

కానీ ప్రస్తుతం దేశంలో..అభ్యర్థి నేరచరిచుడు… అవినీతి పరుడు అని.. స్పష్టంగా తెలస్తున్నా.. వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఓట్లతో గెలుస్తున్నారు. దీని వల్ల నేర చరితులు చట్ట సభలకు సులువుగానే వస్తున్నారు. అలా వచ్చిన వారు తాము ప్రజాకోర్టులో గెలిచామని..ఇతర న్యాయస్థానాలతో తమకు పనేమిటన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఎంత వరకు మేలు చేస్తాయో… వేచి చూడాల్సిందే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close