సురేష్ బాబు… గోడమీద పిల్లి

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు పై నిర్మాత సురేష్ బాబు స్పందన ఏ ఎండకు ఆ గొడుగు పట్టేలా వుంది. ఈ అంశంపై మీ స్పందన ఏమిటనే ప్రశ్నకు.. ఇండస్ట్రీ మొత్తానికి ముడిపెడుతూ ఓ రొటీన్ సమాధానం చెప్పి తప్పించుకున్నారు సురేష్ బాబు. తెలుగు సినీ పరిశ్రమకి ఏ రాజకీయ నాయకులకు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని, ఈ విషయంలో ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పుకొచ్చారు సురేష్ బాబు.

ఈ స్పందన విన్న జనాలు.. సురేష్ బాబు చక్కని కవర్ డ్రైవ్ ఆడారు గానీ స్లిప్స్ లో దొరికిపోయారని కామెంట్స్ చేస్తున్నారు. తనకు వ్యక్తిగతంగా అడిగిన ప్రశ్నకు ఇండస్ట్రీ మొత్తానికి ముడిపెట్టేశారు సురేష్ బాబు. చంద్రబాబు అరెస్ట్ ఐతే ఇండస్ట్రీ స్పందనగా ఒక ప్రెస్ మీట్ పెట్టమనీ ఎవరూ కోరలేదు. వ్యక్తిగత స్పందనే అడిగారు. ఈ విషయంలో సురేష్ బాబు మరీ అమాయకంగా వ్యవహరిస్తున్నారు.

నిజానికి సురేష్ బాబుకు రాజకీయ నేపధ్యం వుంది. తండ్రి రామానాయుడు తెలుగు దేశం ఎంపీగా చేశారు. రాజకీయ ప్రాభల్యం, పలుకుబడి లేకుండా కోట్ల విలువ చేసే స్టూడియోలు, స్థలాలు సొంతం చేసుకున్నారని చెబితే నమ్మేటంత అమాయకులు ఎవరూ లేరు. సినిమా నేపధ్యంలో రాజకీయ పలుకుబడిని వాడుకొని బోలెడు లబ్ది పొందిన కుటుంబం సురేష్ బాబుది.

ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించడానికి భయపడుతున్న కారణం కూడా ఆస్తులే. వైజాగ్ లో స్టూడియో కోసం గత ప్రభుత్వం కోట్ల విలువ చేసే స్థలాల్ని సురేష్ బాబు కి కేటాయించింది. ఇప్పుడు అక్కడ సినిమాలకి సంబధించిన ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. జగన్ ప్రభుత్వం ఆ భూములని తిరిగి గుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది, ఇలాంటి సమయంలో చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడితే ఏం జరుగుతుందో సురేష్ బాబుకి బాగా తెలుసు.

అందుకే పనిలో పనిగా ఎన్టీఆర్, చెన్నారెడ్డి తెలుగు సినిమా అభివృద్ధికి అత్యంత కృషి చేశారని..తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా సహకరించాని చెప్పి… చిత్ర పరిశ్రమకు చంద్రబాబు ప్రత్యేకంగా చేసిన మేలు ఏమీ లేదట్లు చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు సురేష్ బాబు.

సురేష్ బాబు చాలా తెలివిగా స్పందించారని అనుకుంటున్నారేమో కానీ ఒక పౌరుడిగా తన అభిప్రాయాన్ని చెప్పే స్వేఛ్చ కూడా లేని పరిస్థితిలో వున్నారని ఆయన మాటలు విన్నవారికి అర్ధమౌతుంది. సురేష్ బాబు కప్పదాటు వైఖరని అర్ధం చేసుకోలేని అమాయకత్వంలో ఎవరూ లేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నార్త్ కు మోడీ ప్రాధాన్యత…దక్షిణాదిలో బీజేపీకి ఓట్లు రాలేనా..?

మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోందని, దక్షిణాది రాష్ట్రాలను విస్మరిస్తోందని విమర్శలున్నాయి. బడ్జెట్ కేటాయింపులు , కేంద్ర మంత్రివర్గ శాఖలు.. ఇలా ఎలా చూసినా నార్త్...

ఓటేస్తున్నారా ? : బోడిగుండుగా మారిన రుషికొండను గుర్తు చేసుకోండి !

చంద్రబాబు హయాంలో ఐదు వందల కోట్లు పెట్టి సచివాలయ భవనాలు, అసెంబ్లీని నిర్మించారు. అవి ట్రాన్సిట్ భవనాలు. ఐకాన్ బిల్డింగ్స్ కట్టడానికి పునాదులు వేసే సరికి జగన్ వచ్చి కూర్చున్నారు. ఈ ఐదేళ్లలో...

ఇక నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ బంద్… ఎందుకంటే..?

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇక నుంచి టీకాను ఉత్పత్తి చేయబోమని స్పష్టం చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు సమర్ధవంతమైన టీకాలు అందుబాటులోకి వచ్చినందున ఇక తమ వ్యాక్సిన్ అవసరం లేదని...

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close