జగన్ నిర్ణయంపై స్వరూపానంద అసంతృప్తి !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా తన  ఆశీస్సులతోనే అన్నట్లుగా షో చేసే స్వరూపానందకు ఏపీ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం అసలు నచ్చలేదు. అదే బీసీ సంక్షేమ లో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను విలీనం చేయడం. ఇటీవలే రిషికేష్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్షలు చేయడం ప్రారంభించారేమో కానీ దేవాదాయశాఖ కింద ఉన్న  బ్రాహ్మణ కార్పొరేషన్‌ను.. బీసీ సంక్షేమ శాఖ కిందకు మార్చడం  గురించి ఆయన ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ సమాచారాన్ని మీడియాకు కూడా తెలియచేశారు.

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడమే కాదు.. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో స్వామీజీ  అందరికీ తెలియచేశారు. నిజంగా ఆయనకు నచ్చకపోతే నేరుగా సీఎంతో మాట్లాడి ఆ నిర్ణయాన్ని ఉపసంహరింప చేసి ఆ తర్వాత మీడియాకు చెప్పి ఉండేవారు. కానీ తనకు నచ్చలేదని.. సీఎంవోతో మాట్లాడుతున్నామని స్వరూపానంద ఆశ్రమం ప్రకటన ఇచ్చింది.

ఈ అంశంలో బ్రాహ్మణ వర్గం నుంచి వ్యతిరేకత ఉందన్న కారణంగా ఇలా స్వరూపానందతో  ప్రకటన చేయించారన్న అభిప్రాయం కూడా కొంత మందిలో వినిపిస్తోంది. ఎందుకంటే జగన్ నిర్ణయాలను ఎప్పటికప్పుడు సమర్థించడమే కానీ వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందో స్వరూపాదనందకు తెలియకుండా ఉండదని అంటున్నారు. స్వరూపానంద చెప్పారని.. ఆయనకు నచ్చలేదని రేపు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను మళ్లీ దేవాదాయశాఖకు కిందకు తెస్తారేమోనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close