అమిత్ షాతో సమావేశానికి కేసీఆర్ డుమ్మా !

ఆదివారం తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఆయనకు బదులుగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెళ్తున్నారు. రెండేళ్ల తర్వాత జరగనున్న ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారా లేదా అన్నదానిపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. కేంద్రంపై కేసీఆర్ విరుచుకుపడుతున్న సమయంలో … సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశలో ధాటిగా తన వాదన వినిపిస్తారని అనుకున్నారు. అధికారులు కూడా నివేదికలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు రెడీ చేశారు. కానీ కేసీఆర్ చివరి క్షణంలో తిరుపతి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.

రెండేళ్లుగా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగలేదు. ఈ ఏడాది మార్చి 4వ తేదీన జరపడానికి అన్ని ఏర్పాట్లు జరిగినా ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సహా తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల సీఎంలు కూడా హాజరవుతున్నారు. పుదుచ్చేరి సీఎంతో పాటు అండమాన్, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు కూడా హాజరవుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. 27 అంశాలతో ఎజెండా సిద్ధమయింది.

మూడు రాజధానులకు నిధులు , ప్రత్యేకహోదా ల కోసం కేంద్రాన్ని ప్రశ్నిస్తామని ప్రభుత్వం మీడియాకు సమాచారం లీక్ చేసింది. అయితే ఎజెండాలో మాత్రం ప్రధానంగా తెలంగాణ, తమిళనాడు నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు.. ఇతరఅంశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా హాజరవుతారా లేకపోతే.. ప్రతినిధుల్ని పంపుతారా అన్నదానిపై స్పష్టత లేదు. కేంద్రంపై ఒక్క కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల సీఎంలందరూ అసంతృప్తిగానే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close