సుశీ ఇన్‌ఫ్రాపై తెలంగాణ సర్కార్ గురి !

కేంద్ర ప్రభుత్వానికి ఇన్‌కంట్యాక్స్ ఉంటే.. తెలంగాణకు కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంట్ ఉందని.. గుర్తు చేసేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా సంస్థపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. పదిహేను బృందాలు ఏకంగా 150 మంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై ఐటీ, ఈడీ దాడులతో విరుచుకుపడుతూంటే.. బీజేపీనేతలపై తెలంగాణ సర్కార్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంట్‌ను ప్రయోగిస్తోందని దీని ద్వారా అర్థమవుతోందంటున్నారు.

ఇటీవల మునుగోడు ఉపఎన్నికల్లో సుశీ ఇన్ ఫ్రా వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఆ సంస్థకు కేంద్రం రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు కేటాయించిందని .. అందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి. అదే సమయంలో ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు సుశీ ఇన్ ఫ్రా సంస్థ నుంచి మునుగోడు నియోజకవర్గంలో కొంత మంది నేతలకు రూ. కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారని టీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఆధారాల్లేవని ఈసీ ఆ ఫిర్యాదును తోసి పుచ్చింది. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత సుశీ ఇన్‌ఫ్రా టార్గెట్‌గా తెలంగాణ సర్వీస్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపుతోంది.

రాజకీయ కోణంలోనే ఈ దాడులు చేస్తున్నారని .. బీజేపీ నేతలంటున్నారు. కేంద్ర సంస్థలు.. దాడులు చేస్తున్నాయని.. దానికి పోటీగా తమ వద్ద కూడా దర్యాప్తు సంస్థలు ఉన్నాయని చూపించేందుకు ఇలా బీజేపీ నేతలకు చెందిన వ్యాపార సంస్థలపై దాడులు చేస్తున్నారని అంటున్నారు. ఈ సోదాల అంశంపై ఇంకా టీఆర్ఎస్ నేతలెవరూ స్పందించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close