ఆ రాజ్యసభ సీటెవరరికి !?

తెలంగాణలో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానం కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల కానుండగా, 30తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు కార్యకార్యక్రమం చేపట్టనుంది. మరో రెండున్నరేళ్ల పదవీకాలం ఉండగానే బండా ప్రకాశ్‌ను ఎమ్మెల్సీగా గులాబీనేత అవకాశం కల్పించారు. ముదిరాజ్ కులానికి చెందిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత ఆ కమ్యూనిటీ పార్టీకి దూరం కాకూడదని భావించి ప్రకాశ్‌ను ఎమ్మెల్సీగా చేసినట్లు ప్రచారం జరిగింది. ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

స్వల్పకాలం పదవి కావడంతో కేసీఆర్ ఆలోచనలు వేరుగా ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు, ఇటీవల మళ్లీ దగ్గరైన సీఎల్ రాజం, సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌ వంటి వారి పేర్లు పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. మోత్కుపల్లి నర్సింహులు కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. ఇప్పటికి ఒక్క స్థానానికే నోటిఫికేషన్ వచ్చినా మరో నెలలో మరో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. సిట్టింగ్ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డీ. శ్రీనివాస్ పదవి కాలం ముగియనుంది. ఒకరికి వయసు సహకరించడం లేదు.. మరొకరు టీఆర్ఎస్‌లో లేరు . దీంతో కొత్త వారికి చాన్స్ ఖాయంగా కనిపిస్తోంది.

దేశ రాజకీయాలపై, ఫోకస్ పోట్టిన గులాబీ అధినేత కేసీఆర్ రాజ్యసభకు ఎంపిక చేసేవారు తెలంగాణ గళాన్ని బలంగా వినిపించేలా, అండగా నిలిచేలా ఉన్న నేతలు, రాజకీయాలపై పట్టుండి, మాట్లాడేవారిని ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దళితబంధును ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్రంలో అమలు చేస్తుండటంతో ఆ విషయాన్ని దేశమంతా ప్రచారం చేసేందుకు ప్రధాన ఆస్త్రంగా ఉపయోగపడేలా దళితులకు ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తారని చెబుతున్నారు. మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల్ని ఒకే సారి ప్రకటించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close