సీనియర్ల మెడలు వంచిన రేవంత్ రెడ్డి !

తెలంగాణ కాంగ్రెస్ లో తాము సీనియర్లం.. తాము టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఏమిటి అన్న “హై”లో ఉన్న నేతల మెడలను రేవంత్ రెడ్డి వంచేశారు. టిక్కెట్ కావాలనుకున్న వారంతా దరఖాస్తు చేసుకున్నారు. చివరికి కోమటిరెడ్డి కూడా తనకు నల్లగొండ స్థానం కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ పెట్టుకోకపోతే ఆ పేరు చెప్పి టిక్కెట్ నిరాకరిస్తారేమోనని చాలా మంది కంగారు పడి.. చివరి రోజు హడావుడిగా పీఏలతో దరఖాస్తులు పంపించారు.

తాము సీనియర్లమని.. తమకు పిలిచి టిక్కెట్ ఇస్తారన్న అభిప్రాయం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోక తప్పలేదు. రూ. 50వేలు ఫీజు కట్టి మరీ తమకు కావాల్సిన చోట దరఖాస్తు చేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ, సీనియర్ నేత జానారెడ్డి కుమారులు, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు అందరూ అప్లికేషన్లు ఇచ్చారు. ఒక రోజు ముందే రేవంత్ రెడ్డి తరపున ఆయన అనుచరులు కొడంగల్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు. ఖచ్చితంగా దరఖాస్తు చేసుకున్న వారి పేర్లనే పరిశీలిస్తామని హైకమాండ్ చెప్పడంతో.. సీనియర్లు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అనూహ్యంగా హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమయింది. మధుయాష్కీకి.. ఎల్బీనగర్ కు సంబంధమే లేదని.. నిజామాబాద్‌లో గెలుపు కష్టమని భావించి గ్రేటర్ పరిధిలోప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 119 స్థానాల కోసం దాదాపుగా వెయ్యి దరఖాస్తులు వచ్చినట్లుగా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఈ దరఖాస్తులను వడబోసి.. షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థుల పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close