సుప్రీంలో పిటిషన్లేశారు.. విచారణ ఇప్పుడే వద్దంటున్నారు..!

ఏపీ హైకోర్టు ఇచ్చిన అనేకానేక తీర్పుల మీద అయిననూ పోయి రావలె అన్నట్లు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన ఏపీ సర్కార్.. ఇప్పుడు విచారణకు వెనక్కు తగ్గుతోంది. విచారణలకు సమయం కావాలంటూ న్యాయవాదుల ద్వారా అభ్యర్థిస్తోంది. ఈ ఒక్కరోజే.. అలాంటి నాలుగు కేసులు మూడు వారాలకు వాయిదా పడ్డాయి. అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయని ఏపీ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. అసలు నేరం జరిగిందో లేదో తెలియకుండా దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయడంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఏపీ సర్కార్ ఈ స్టే నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

దీనిపై విచారణ సుప్రీంకోర్టు ముందుకు వచ్చే సరికి.. విచారణకు మూడు వారాల సమయం కావాలని ఏపీ సర్కార్ కోరింది. అలాగే.. అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో ఏపీ సర్కార్ సవాల్ చేసింది. ఆ కేసులోనూ.. విచారణకు 3 వారాల సమయం కోరింది ఏపీ ప్రభుత్వం. అలాగే మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి.. ఆస్తుల కొనుగోలు అంశంపై పైనా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఇందులోనూ మూడు వారాల సమయం కావాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అన్ని కేసుల్లోనూ అలాగే కోరడం.. న్యాయమూర్తి అంగీకరించడం జరిగిపోయాయి.

దీంతో ఎంతో ఆవేశంగా సుప్రీంకోర్టుకు వచ్చిన ఏపీ సర్కార్ ఇప్పుడు ఎందుకు వాదనలు వినిపించడానికి వెనుకడుగు వేస్తోందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరో వైపు.. సీజేఐకి జగన్‌ రాసిన లేఖను బహిర్గతం చేయడంపై.. చర్యలు తీసుకోవాలని గతంలో న్యాయవాది సునీల్‌కుమార్‌సింగ్ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వడానికి సుప్రీంకోర్టును 3 వారాల సమయం కోరారు. దీనికీ సుప్రీంకోర్టు అంగీకరించింది. కారణం ఏమిటో కానీ.. వాయిదాల పద్దతిని ఏపీ సర్కార్ ఎంచుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close