వచ్చే నెల వాటా కూడా ఇచ్చేశారు.. కేంద్రానికి ఎంత ప్రేమో!?

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర పన్నుల వాటా సొమ్ము దాదాపుగా రూ. నాలుగు వేల కోట్లు ఖాతాలో పడ్డాయి. దీంతో నెలాఖరు వస్తోంది.. ఆర్బీఐ దగ్గర అప్పులు తీసుకునే పరిస్థితి లేదు ఎలా అని కంగారు పడుతున్న సమయంలో కేంద్రం పాలకులకు ఏ మాత్రం టెన్షన్ లేకుండా డబ్బులను ఖాతాలో జమ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో కేంద్రం ఎందుకు ఇచ్చింది అంటే… పన్నుల వాటా. ప్రతి నెలా రాష్ట్రానికి పన్నుల వాటా కింద రూ. పద్దెనిమిది వందల కోట్ల వరకూ వస్తాయి. కానీ ఈ సారి అవి రాష్ట్ర ప్రభుత్వానికి సరిపోవు. ఏదో ఓ పరిష్కార మార్గం చూపించాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో పదే పదే మంత్రాంగం జరిపిన ఫలితంగా వచ్చే నెల పన్నుల వాటా కూడా ఈ నెలే ఇచ్చేలా అంగీకరింపచేశారు.

ఒక్క ఏపీకే అలా ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలకు వర్తింప చేశారు. అందరికీ వచ్చే నెల పన్నుల వాటా కూడా ఈ నెలే ఇచ్చేశారు. ప్రతి నెలా అన్ని రాష్ట్రాలకు రూ. నలభై ఐదు వేల కోట్ల వరకూ పన్నుల వాటా ఇస్తారు.. ఈ సారి మాత్రం రూ. 90వేల కోట్లు ఇచ్చారు. కొత్త అప్పులు వెదుక్కునే ప్రయత్నంలో కీలక దశలో ఉన్న ఏపీ సర్కార్‌కు కేంద్రం చేసిన సాయం ఎంతో రిలీఫ్ ఇస్తుంది. సామాజిక పెన్షన్లు, జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు ఇబ్బందులు లేకుండా చూస్తోంది. అయితే వచ్చే నెల పన్నుల ఆదాయం కూడా ఇప్పుడే తీసుకుంటే మరి వచ్చే నెల పరిస్థితేమిటి ? అప్పటికి కేంద్రం ఏదో ఓ పరిష్కారం చూపిస్తుందని భావిస్తున్నారు.

ఆర్బీఐ నుంచి అదనపు రుణం కోసం నిర్మలా సీతారామన్ అనుమతి ఇప్పిస్తారని.. లేకపోతే మరో ఆర్థిక సంస్థ నుంచి అయినా ఇప్పిస్తారని.. తమను ఇలా వదిలేయరని ఏపీ ప్రభుత్వ వర్గాలు నమ్ముతున్నాయి. కేంద్రం బాధ్యత తీసుకున్నంత వరకూ ఏపీ సర్కార్ ఎన్ని వేల కోట్లకు లెక్కలు చెప్పకపోయినా నిధులు అలా వచ్చిపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎవరికీ ఫికర్ లేదు. కాకపోతే బుగ్గనకు మాత్రమే కాస్త ఢిల్లీలో పని.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close