కాల్‌మనీపై గవర్నర్ కూడా స్పందించారు!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న కాల్‌మనీ బాగోతంపై ఏపీ, తెలంగాణల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కూడా స్పందించారు. బయట వ్యక్తులనుంచి ఎవరూ రుణాలు తీసుకోవద్దని, ప్రభుత్వ సంస్థలనుంచే తీసుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని యల్లమందలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ డంప్ యార్డ్‌కు కూడా శంకుస్థాపన చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల లబ్దిదారులతో ముఖాముఖిలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత మరుగుదొడ్లను అందరూ వినియోగించుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మద్యానికి అందరూ దూరంగా ఉండాలని అన్నారు. నరసరావుపేట శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనటం కోసం గవర్నర్ గుంటూరు జిల్లాకు వచ్చారు.

మొత్తం మీద గవర్నర్ రబ్బర్ స్టాంప్ లాగా ఉండకుండా సమకాలీన అంశాలపై బాగానే స్పందిస్తున్నారు. ఇవాళ కాల్ మనీ వ్యవహారంపై స్పందించిన ఆయన, నిన్న ప్రైవేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణిపై కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. వైద్యపరీక్షల పేరుతో ప్రజలను పీడిస్తున్నారని మండిపడ్డారు. జలుబుకు కూడా బ్రెయిన్ టెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close