అభ్యర్థులతో తెలంగాణ బీజేపీ బంతాట !

సంగారెడ్డి నామినేషన్ కేంద్రం నుంచి దేశ్ పాండే అనే నేత నేరుగా కిషన్ రెడ్డికి ఫోన్ చేసి లిస్టులో తన పేరు పెట్టి.. బీఫాం వేరే వాళ్లకు ఇవ్వడం ఏమిటని.. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఏడుస్తూ చెప్పారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో వైపు వేమువలవాడలో తుల ఉమ అనే మహిళా నేతకూ అదే పరిస్థితి. అక్కడ ఆమెకు టిక్కెట్ ప్రకటించి.. తరవాత విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుకు బీఫాం ఇచ్చారు. ఇవే కాదు.. లెక్కలేనన్ని చిత్రాలు… బీజేపీలో జరిగాయి.

కంటోన్మెంట్‌ లో చివరి క్షణంలో కాంగ్రెస్‌ అసంతృప్త నేత గణేశ్‌కు టికెట్‌ కట్టబెట్టింది. వనపర్తిలోనూ అభ్యర్థిని మార్చేసింది. సంగారెడ్డిలో పోటీచేయాలని బీజేపీ ఆఫర్‌ ఇచ్చినా నీలం మధు ఆసక్తి చూపలేదు. ఆయన బీఎస్పీవైపు మొగ్గుచూపారు. తెలంగాణలో పార్టీ అభ్యర్థుల ప్రకటన విషయంలో మొదటి నుంచీ గందరగోళ పడుతూనే ఉంది బీజేపీ. వేములవాడ సీటు విషయంలో బీజేపీ తర్జనభర్జనలు పడి మూడో లిస్టులో తుల ఉమకు కేటాయించింది. ఆమెకు టికెట్‌ ఇవ్వకపోతే తాను పార్టీని వీడుతానంటూ ఈటల రాజేందర్‌ ఒకానొక దశలో అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి చేశారు. వేలాది మందితో ఆమె నామినేషన్‌ కూడా వేశారు. కానీ చివరి లిస్టులో వికాస్‌రావు పేరును ప్రకటించింది. చివరిక్షణంలో ఆయనకు బీ-ఫాం అందజేసింది.

బీజేపీ అధిష్టానం వనపర్తి సీటును ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డికి కేటాయించింది. ఆయన నామినేషన్‌ కూడా వేశారు. తీరా చివరి నిమిషయంలో అక్కడ బీ-ఫాం వేరే వారికి కేటాయించింది. బెల్లంపల్లి సీటును తొలుత శ్రీదేవికి ఇచ్చింది. తీరా నాలుగో లిస్టులో ఏమాజి పేరును ప్రకటించి అందర్నీ అయోమయానికి గురిచేసింది. మళ్లీ తమ అభ్యర్థి శ్రీదేవినే అని చెప్పి బీ-ఫాం అందజేసింది. అలంపూర్‌ స్థానంలో మరియమ్మకు సీటు కేటాయించారు. చివరకు ఆమె స్థానంలో రాజగోపాల్‌ను ఫైనల్‌ చేశారు. చాంద్రాయణగుట్ట అభ్యర్థి పోటీచేయబోనని ప్రకటించడంతో కొత్తగా కె.మహేందర్‌ను ప్రకటించింది.

బలమైన అభ్యర్థులు లేరనుకుంటే.. ఉన్న వారితోనే ఇలా సర్కస్ ఆడుకోవడంతో… బీజేపీ ఇంత గందరగోళంగా ఎందుకు మారిందని క్యాడర్ తలబాదుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close