తెలంగాణ బీజేపీలో అప్పుడే టిక్కెట్ల లొల్లి !

తెలంగాణ బీజేపీలోనూ కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ప్రారంభమవుతున్నాయి. ఇటీవల ఆ పార్టీలోని ఓ వర్గం నేతలు అరవై వరకూ అసెంబ్లీ స్థానాల్లో టిక్కెట్లను ారు నెలల ముందుగానే ప్రకటిస్తుందని చెప్పడం ప్రారంభించారు. దీంతో టిక్కెట్ల గురించి ఏమైనా చెప్పాలంటే తాను చెప్పాలి కానీ ఇతరులు చెప్పడం ఏమిటని బండి సంజయ్ ఫీలయ్యారు. వెంటనే ఇలా టిక్కెట్ల గురించి ప్రచారం చేసే వాళ్లకి టిక్కెట్లు ఇవ్వరని నేరుగా పార్టీ సమావేశాల్లోనే హెచ్చరించడం ప్రారంభించారు. తన టిక్కెట్‌కే గ్యారంటీ లేదని ఇక ఇతరులకు టిక్కెట్లు ఎలా వస్తాయని ఆయన చెబుతున్నారు.

ఇటీవల బీజేపీలో ఈటల రాజేందర్ తన వర్గాన్ని పెంచుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా కొంత మంది నేతల్ని ప్రోత్సహిస్తూ వారికే టిక్కెట్ వస్తుందని చెప్పడం ప్రారంభించారు. అంతే కాక ఆరు నెలల ముందుగానే టిక్కెట్ల ప్రకటన ఉందని చెబుతున్నారు. ఇది బండి సంజయ్‌కు నచ్చడం లేదు. బండి సంజయ్ కూడా తన వర్గాన్ని విస్తృతంగా పెంచుకుంటున్నారు. కిషన్ రెడ్డిజాతీయ రాజకీయాల్లో ఉండటంతో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రాబల్యాన్ని విస్తరించుకోలేకపోతున్నారు. కానీ స్థానికంగా .. బీజేపీ అధ్యక్షుడిగా ఉంటూ బండి సంజయ్.. కొంత మందిని ఖరారు చేసి నియోజకవర్గాలకు పంపుతున్నారు.

ఆయన వర్గం ఇప్పటికే యాభై, అరవై సీట్లలో అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బండి సంజయ్ ఎక్కడకు వెళ్తే అక్కడకు మందీ మార్బలంతో వెళ్తున్నారు . ఈ పరిణామాలతో బీజేపీలోని ఇతర సీనియర్ నేతలు కూడా తామేం తక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాను గుంభనంగా ఇచ్చే టిక్కెట్ల హామీ విషయంలో బండి సంజయ్ దూకుడుగానే ఉన్నా.. ఇతర నేతలు ఇస్తున్న హామీలను మాత్రం మధ్యలోనే కొట్టేస్తున్నారు. బీజేపీలో అంతర్గత రాజకీయం ముదిరిపాకాన పడుతోందన్న అభిప్రాయానికి. .. బండి సంజయ్ సొంత పార్టీ నేతలపై తరచూ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close