ఇక సింగరేణి గ్రౌండ్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ !

బడ్జెట్ మీద నిన్నటిదాకా బీజేపీపై విరుచుకుపడిన టీఆర్ఎస్ తాజాగా సింగరేణి అంశాన్ని ఎత్తుకుంది. సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరిస్తోందని ఆరోపిస్తూ కేటీఆర్ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి ఘాటు లేఖ రాశారు. దాన్ని మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకునేలా చేశారు. ఇటీవల కేంద్రం నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని నిర్ణయించింది. వాటిని సింగరేణికి కేటాయించకపోవడం అంటే ప్రైవేటీకరణకు తొలి మెట్టు అని.. ఇలాంటి వాటిని తాము సహించబోమని కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ కేంద్రమంత్రికి రాసిన లేఖ… కాస్త ఘాటు పదాలతోనే ఉంది.

నేడో రేపో సింగరేణిని వేలం వేసేస్తున్నారన్నట్లుగా కేటీఆర్ లేఖ సంధించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కావల్సిన ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసిన కేంద్రం దాన్ని ప్రయివేటీకరించేందుకు రంగం సిద్దం చేసిందన్నారు. ఇలాంటి కుట్రలనే సింగరేణిపై ప్రయోగించేందుకు రంగం సిద్దం చేస్తున్నదని అందోళన వ్యక్తం చేశారు. సింగరేణి అంటే కోల్ మైన్ మాత్రమే కాదని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే గోల్డ్ మైన్ అని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. నాలుగు బ్లాకులు మాత్రమే వేలం వేయడం లేదని, వేలాది మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్ లో వేలం వేస్తోందని కేటీఆర్ విమర్శించారు. తక్షణం వేలం ఆపాలన్నారు.

కేటీఆర్ లేఖపై బీజేపీ ఉలిక్కి పడింది. బొగ్గు బ్లాకుల వేలం సహజంగానే జరుగుతోందని సింగరేణికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. గతంలో ఒడిషాలో తొమ్మిది బ్లాకుల్ని తెలంగాణ వేలంలో దక్కించుకుందన్నారు. అనవసరంగా సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నాలు కేటీఆర్ చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. రూ.20 వేల కోట్లను దారి మళ్లించి సింగరేణిని కేసీఆర్ దివాలా తీయిస్తోంది కేసీఆరేనని.. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు సంస్థలో 62 వేల మంది కార్మికులుంటే ఇప్పుడు 40 వేల మందే ఉన్నారన్నారు.

బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరాటంలో వారానికో కొత్త అంశంతో ఫైట్ లైవ్‌లో ఉండేలా చూసుకోవడంలో రెండు పార్టీలు సక్సెస్ అవుతున్నాయని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close