చంద్రబాబు వ్యూహాలపై టీఆర్ఎస్ నేతలకు బెంగ పట్టుకుందా..?

తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు భయపడుతున్నారా..?. ఎన్నికల భారం మొత్తం… తెలంగాణ టీడీపీ నేతలకే అప్పగించేసి చంద్రబాబు సైడైపోయారు. కానీ ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు నమ్మడం లేదు. చంద్రబాబు ప్రత్యక్షంగా తెలంగాణ ఎన్నికల విషయంలో పట్టించుకోకపోయినా..తెర వెనుక వ్యూహరచన చేస్తున్నారని గట్టిగా నమ్ముతున్నారు. ఈ కోణంలోనే చంద్రబాబుపై ఘాటు విమర్శలు ప్రారంభించారు. టీఆర్ఎస్ ఎంపీ, ప్రస్తుతం చెన్నూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాల్క సుమన్… ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు.. తెలంగాణలో క్యాంప్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమిటంటూ.. విమర్శలు గుప్పించారు. వందల కోట్లు తెలంగాణకు తరలించారని ఆరోపించారు. తెలంగాణను కలుషితం చేసేందుకు… చంద్రబాబు ఏపీ ఇంటెలిజెన్స్‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు. వేరే రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ పోలీసులు తెలంగాణలో ఎందుకు తిరుగుతున్నారనేది ఆయనకు వచ్చిన ధర్మసందేహం.

డీజీపీ, గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని సుమన్ డిమాండ్ చేశారు.ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఎవరూ చర్యలు తీసుకోకపోతే… తామే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతామని హెచ్చరికలు కూడా చేశారు. అచ్చంగా ఇలాంటి విమర్శలనే.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా చేశారు. చంద్రబాబు డబ్బు సంచులను తెలంగాణ నుంచి విత్‌ డ్రా చేసుకోకపోతే టీఆర్‌ఎస్ దళాలు పట్టుకుని చట్టానికి అప్పగిస్తాయని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీ నుంచి నిధుల సాయం అందుతుందని… టీఆర్ఎస్ కు కచ్చితమైన సమాచరం వచ్చి ఉంటుందని.. అందుకే.. విమర్శలు ప్రారంభించారన్న అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు.. మాత్రం.. టీఆర్ఎస్ ఆరోపణల్ని తేలిగ్గా తీసి పడేస్తున్నారు. రాజకీయాల్లో .. అలా చేస్తారేమో అన్న భయంతో.. ముందస్తుగా ఆరోపణలు చేస్తూంటారని..టీఆర్ఎస్ నేతలు అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారంటున్నారు. అంతగా.. ఏపీ నుంచి డబ్బు సంచులు వస్తే.. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని చేతుల్లో ఉంచుకుని.. ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసని… విపక్ష నేతంలదరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న అనుమానాన్ని టీ టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి…మహాకూటమితో టీఆర్ఎస్ పోటీలో… ప్రధానంగా చంద్రబాబు పేరునే.. గులాబీ నేతుల స్మరిస్తున్నారు. ఆయన వ్యూహాలకు చెక్ పెట్టడానికి ముందస్తు ఆరోపణలు ప్రారంభించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close