పెళ్లిళ్లపై పవన్‌ను ప్రశ్నించిన బాలయ్య – అన్‌స్టాపబుల్ హైలెట్స్ ఇవే!

ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో సెకండ్ సీజన్ లో మరో ప్రతిష్టాత్మక ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్… ఈ షోకి గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో బాలకృష్ణ అతిధులుగా వస్తున్న వారి వ్యక్తిగతం జీవితంలో ఉన్న వివాదాస్పద అంశాలపైనా ప్రశ్నిస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ మ్యారేజెస్ గురించి కూడా ఈ షోలో ప్రశ్నిస్తారా అన్న చర్చ జరిగింది. అలాంటి ప్రశ్నలు అడగవద్దని పవన్ మాట తీసుకున్నారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరిగింది. కానీ అదంతా అబద్దం. షోలో పవన్ కల్యాణ్ ను.. బాలకృష్ణ పెళ్లిళ్ల వివాదం గురించి ప్రశ్నించారు.

అసలు ఈ పెళ్లి ఏంటయ్యా.. అని బాలకృష్ణ నేరుగా పవన్ ను ప్రశ్నించారు. దానికి పవన్ కల్యాణ్.. చాలా క్లియర్‌గా డీప్ గా తన జీవితంలో అసలేం జరిగిందో వివరించారు. ఎక్కడా దాచుకోలేదు. ఇంత కాలం తన వ్యక్తిగత జీవితాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. కానీ ఈ షో ద్వారా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలనుకున్నట్లుగా కనిపించింది. ఆయన మొత్తం చెప్పారు. బాలకృష్ణ కూడా.. పవన్ కల్యాణ్ సమాధానం విన్న తర్వాత .. ఇంత క్లియర్‌గా స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా చెప్పిన తర్వాత కూడా.. కల్యాణ్ ని పర్సనల్ గా టార్గెట్ చేస్తే.. వాళ్లు ఊర కుక్కలతో సమానం అని కామెంట్ కూడా చేశారు.

వైసీపీ నాయకులు మాట్లాడితే పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూంటారు. ఇంకా విశేషం ఏమిటంటే.. ఇలా మాట్లాడేవారిలో సీఎం జగన్ కూడా ఉంటారు. ఇటీవల ఆయన పవన్ లా ఆ భార్య కాకపోతే… ఈ భార్య లా ఉండనని చేసిన కామెంట్ చర్చనీయాంశమయింది. ఇప్పుడీ ఈ టాక్ షో తర్వాత వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఈ షోలో మరో హైలెట్ ఏమిటంటే.. సాయి ధరమ్ తేజ్ మధ్యలో షోలో పార్టిసిపేట్ చేశారు. రామ్ చరణ్ .. ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. మొత్తంగా పవన్ కల్యాణ్ ఎపిసోడ్ .. రాష్ట్రం మొత్తం మరోసారి హైలెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అది రాజకీయంగా.. ఇటు వినోదపరంగా కూడా ..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సందీప్ సినిమాలో ‘మ‌న్మ‌థుడు’ హీరోయిన్‌

'మ‌న్మ‌థుడు'లో క‌థానాయిక గా మెరిసిన అన్షు గుర్తుంది క‌దా? ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యాక అన్షుకి మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. కానీ.. రెండు మూడు సినిమాల త‌ర‌వాత‌.. లండ‌న్ వెళ్లిపోయింది....

గుంటూరు జిల్లా టీడీపీలో చేరికల హుషారు !

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ పూర్తిగా బలహీనపడుతోంది. ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వరుసగా టీడీపీలో చేరిపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అనేక మంది టీడీపీలో...

కవిత బెయిల్ రిజెక్ట్ – ఇప్పుడల్లా కష్టమే !

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టి వేసింది. గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా...

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close