విజ‌య్ దేవ‌ర‌కొండ‌… యాపారం బాగుంది!

టాలీవుడ్‌కి కొత్త‌గా పుట్టిన స్టార్ .. విజ‌య్ దేవ‌ర‌కొండ‌. వ‌రుస సూప‌ర్ హిట్ల‌తో చెల‌రేగిపోతున్నాడు. `నోటా`తో త‌మిళంలోనూ అడుగుపెట్టాడు. `గీత గోవింద‌` త‌ర‌వాత త‌న పారితోషికం మ‌రింత పెర‌గ‌డం ఖాయం. మ‌రోవైపు విజ‌య్ వ్యాపారం కూడా బాగానే సాగుతోంది. `రౌడీ` పేరుతో విజయ్ వ‌స్త్రాల బ్రాండింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసింది. బొటిక్ త‌ర‌హాలో సాగుతున్న ఈ వ్యాపారం మూడు పువ్వులూ ఆరు కాయ‌లుగా సాగుతోంది. వివిధ దేశాల నుంచి వ‌స్త్రాల్ని దిగుమ‌తి చేసి, బెంగ‌ళూరులో డిజైనింగ్ చేసి దింపుతున్నాడు విజ‌య్‌. ప్ర‌తీ బుధ‌వారం ఓ కొత్త మోడ‌ల్‌ని ప్ర‌వేశ పెడుతుంటే.. వ‌చ్చిన స్టాకంతా 40 నిమిషాల్లోనే పూర్త‌యిపోతోంద‌ట‌. దాంతో ఈ వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించాల‌ని విజ‌య్ నిర్ణ‌యం తీసుకున్నాడు. “నాకు చిన్న‌ప్ప‌టి నుంచీ డ్ర‌స్సింగ్ అంటే ఇష్టం. ఫారెన్ నుంచి కూడా నా కాస్ట్యూమ్స్‌ని దిగుమ‌తి చేయించుకుంటుంటా. నా అభిరుచి త‌గ్గ‌ట్టు రౌడీ పేరుతో బ్రాండింగ్ చేస్తున్నా. స్పంద‌న చాలా బాగుంది. నా ఆడియో ఫంక్ష‌న్ల‌కు అభిమానులు కొంత‌మంది నా త‌ర‌హా వ‌స్త్ర‌ధార‌ణ‌తో రావ‌డం న‌న్ను మ‌రింత ఉత్సాహ‌ప‌రుస్తోంది“ అంటున్నాడు విజ‌య్‌. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవ‌డం అంటే ఇదే. క్రేజ్ మొద‌లైన‌ప్పుడే.. ఇలా బ్రాండింగ్‌ల పేరుతో బాగానే సొమ్ము చేసుకుంటున్నాడు విజ‌య్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ కుట్రలకు వీరనారిలా ఎదురు నిలిచిన మహిళ..!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను తమ చెప్పు,చేతుల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఎన్నికలను కూడా సరైన విధంగా నిర్వహించేందుకు వైసీపీ సహకరిస్తుందా..? అనే...

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close