పాపం సచివాలయ ఉద్యోగులు – జీవితాంతం అదే జీతం..అదే క్యాడర్ !

జగనన్న ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నాడని…సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను సైతం వదిలి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగంలో చేరిన వారికి ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తోంది. తమ జీవితం దుర్భరమైపోయిందని… మొత్తంగా ఒక్క అడుగుతో నాశనం చేసుకున్నామని బాధపడే పరిస్థితి వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇక ముందు ఎలాంటి ప్రమోషన్లు ఉండవు. ఇప్పుడు వారు ఏ పని చేస్తున్నారో.. ఏ క్యాడర్‌లో పని చేస్తున్నారో.. అదే పని..అదే క్యాడర్‌లో రిటైరయ్యే వరకూ ఉండాలి. ఎదుగూబొదుగూ ఉండదు. జీవితంలోనే కాదు.. జీతంలోనూ ఎదుగూబొదుగూ ఉండదు.

ఎందుకంటే క్యాడర్ పెరగనిదే జీతం పెరగదు. ప్రభుత్వాలు ఎప్పుడో దయతలిచి ఇచ్చే పీఆర్సీల ద్వారానే జీతం పెరగాలి. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ఈ పీఆర్సీల్లో కూడా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు విడిగా జీతాల పెంపును నిర్దేశించే ప్రమాదం ముందు ముందు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు చేయడం వల్ల రూ. పదిహేను వేల నుంచి పాతిక వేలకు జీతం పెరుగుతుంది. అది తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాలను ఏమీ వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో విధి నిర్వహణలో మాత్రం ఒత్తిడి విపరీతంగా పెరగనుంది.

ప్రభుత్వ పరంగా ఏ పని చేయాలన్నా భారం వీరిపైనే పడనుంది. అదే సమయంలో వీరు నియామకాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వీరంతా వైసీపీ హయాంలో సరైన ప్రవేశ పరీక్ష లేకుండా నియమితులయ్యారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అదే ప్రభుత్వం మారితే వీరిపై వివక్ష చూపించే అవకాశం ఉంది. అదే జరిగితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మరింత ఇబ్బంది పడతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close