రాజ్యసభ టికెట్‌తో దాసరికి జగన్ గాలం?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా, నిర్ణయాత్మకంగా ఉన్న కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్రణాళికే రచించారని అంటున్నారు. ఇప్పటికే కాపు కులానికి చెందిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో, పవన్ కళ్యాణ్ ఎన్‌డీఏలో ఉండటంతో, వారిద్దరికీ దీటుగా అదే కులానికి చెందిన దాసరిని తమవైపు తిప్పుకుని ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జూన్‌లో జరిగే రాజ్యసభ ఎన్నికలలో వైసీపీకి లభించే ఒక సీటును ఎరగా చూపించి దాసరిని తమ పార్టీలోకి లాక్కోవాలని జగన్ యోచనగా చెబుతున్నారు. అందుకే నిన్న స్వయంగా వెళ్ళి దాసరిని కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే దాసరి తన స్పందనను ఇంకా తెలియజేయలేదు. భవిష్యత్తు జగన్‌దేనని, ప్రతిపక్ష నాయకుడిగా బాగా పనిచేస్తున్నాడని మాత్రం అన్నారు. జగన్ మంచి నాయకుడిగా ఎదుగుతున్నాడని, అతనికి తన దీవెనలు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు.

బొగ్గు కుంభకోణంలో ఇరుక్కున్న దాసరి, కొద్దిరోజుల క్రితం రాజకీయాలలోకి వెళ్ళి తప్పు చేశానని, ఇంక రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు. మరి ఇప్పుడు ఆయన మనసు మార్చుకుంటారా, లేక జగన్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తారా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు ఆయన పవన్ కళ్యాణ్‌తో త్వరలో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ జగన్ పార్టీలో చేరితే పవన్-జగన్‌ ఇద్దరితో స్నేహాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close