‘స్పైడ‌ర్’ పోస్ట‌ర్‌: మానిన గాయాన్ని రేపడ‌మేగా?

మ‌హేష్ బాబు కెరీర్‌లోనే భారీ డిజాస్ట‌ర్ల‌లో ‘స్పైడ‌ర్‌’ ఒక‌టి. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది. త‌మిళంలోనూ ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాడు మ‌హేష్‌. అయితే.. ఈ ప్ర‌య‌త్నం దారుణంగా బెడ‌సికొట్టింది. బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్లు సాధించ‌డంలో విఫ‌ల‌మైన స్పైడ‌ర్‌, విమ‌ర్శ‌ల మ‌న‌సుల్నీ గెలుచుకోలేక‌పోయింది. ఈ సినిమా లోటు పాట్ల‌పై భారీ చ‌ర్చ సాగింది. సోష‌ల్ మీడియాలో సెటైర్లు కూడా బాగానే ప‌డ్డాయి. మ‌హేష్ అభిమానులు కూడా బాగా నొచ్చుకొన్నారు. మా హీరో ఇలాంటి సినిమా చేశాడేంటి? అని బాధ‌ప‌డ్డారు. మెల్ల‌మెల్ల‌గా ఇప్పుడే ఆ ప‌రాభ‌వం నుంచి తేరుకొంటున్నారు ఫ్యాన్స్‌. దానికి తోడు… మ‌హేష్‌బాబు ఖాతాలో మ‌రో నంది అవార్డు చేరింది. శ్రీ‌మంతుడు తో ఉత్త‌మ న‌టుడిగా నంది అవార్డు అందుకోబోతున్నాడు. స్పైడ‌ర్ గుర్తుతులు మ‌ర్చిపోతున్న‌ట్టే అనుకొంటున్న త‌రుణంలో ఆ చిత్ర‌బృందం ఓ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది. ’50 రోజులు ఆడేసింది’ అంటూ.

ఆ పోస్ట‌ర్ చూసిన ఫ్యాన్స్‌కి న‌వ్వాలో, ఏడ‌వాలో అర్థం కాని ప‌రిస్థితి. ఈ సినిమా ఫ్లాప్ అన్న సంగ‌తి స్వ‌యంగా మ‌హేష్ బాబు అభిమానులే ఒప్పుకొంటున్నారు, సినిమా విడుద‌లైన త‌ర‌వాత చిత్ర‌బృందం మీడియా ముందుకు రావ‌డానికి భ‌య‌ప‌డిందంటే – స్పైడ‌ర్ ఏ స్థాయి ఫ్లాపో అర్థం చేసుకోవొచ్చు. స‌రేలే… అంటూ ఆ బాధ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తున్న త‌రుణంలో ఇప్పుడీ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌డం అవ‌స‌ర‌మా?? మ‌రోసారి నాన్ మ‌హేష్ ఫ్యాన్స్ రెచ్చిపోవ‌డానికీ, స్పైడ‌ర్‌పై సెటైర్లు వేసుకోవ‌డానికీ త‌ప్ప‌… వేరే ఉప‌యోగం ఏమైనా ఉందా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని ప్రచారం… షెడ్యూల్ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్న మోడీ రాజ్ భవన్ లో బస చేశారు....

నిర్లక్ష్యమే ముంచింది…కాళేశ్వరంపై నిపుణుల మధ్యంతర నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి సూచించింది.వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని...

పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ – విప్లవమే !

ఐదేళ్ల పాలనలో తాను చాలా విప్లవాలు తెచ్చానని జగన్ రెడ్డి చెబుతూ ఉంటారు. విప్లవం అంటే ఆ రేంజ్ అనుకుంటున్నారో కానీ ఆయన కానీ ఆయన రచయితలు కానీ ఆ పదాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close