బండి పాదయాత్రకు అమిత్ షా రానట్లే !

బండి సంజయ్ రెండో విడత పాదయాత్రను పధ్నాలుగో తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఆ రోజున అమిత్ షా వస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన రావడం లేదని తేలిపోయింది. కొత మంది జాతీయ నేతలతో రెండో విడత పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదాయ్తర ముగింపు సభకు అమిత్ షా వస్తారని చెబుతున్నారు. ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఓ విడత పూర్తయింది.

ఆ విడత పూర్తయిన తర్వాత హుజురాబాద్‌లో భారీ గెలుపు లభించింది. రెండో విడత ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే బండి సంజయ్ ఇమేజ్ అమాంతం పెంచుకున్నారు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారిని దాటి ముందుకెళ్తున్నారు. 14న అలంపూర్ జోగులాంబ ఆలయం వద్ద నుంచి రెండో విడత ప్రారంభిస్తారు. ఈ యాత్రలో కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థాయి నాయకులు హాజరయ్యారు. హుజురాబాద్ ఉపఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఆ ఎన్నికల్లో గెలుపుతో బండి సంజయ్ ఇమేజ్ మరింత పెరిగింది.

రెండో విడత పాదయాత్రలో కేంద్రం ప్రతినిధులుగా ప్రతీ వారం ఓ కేంద్రమంత్రి బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొనేలా షెడ్యూల్ రూపొందంచారు. అమిత్‌ షా పర్యవేక్షణలో పనిచేసే ఆరుగురు సభ్యుల బృందం రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటికే పనిచేయడం మొదలుపెట్టింది. అమిత్ షాటీం.. ప్రజా సంగ్రామ యాత్ర వెంటే సాగుతూ ఎప్పటికప్పుడు అమిత్‌ షా, నడ్డాలకు నివేదికలు పంపనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close