లోక్ సత్తా నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ ?

లోక్ సత్తా పార్టీ పేరు వినగానే తెలుగువారికి గుర్తొచ్చేది ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన జయప్రకాష్ నారాయణ. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన పార్టీని వీడి బయటకు వచ్చేయడం పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం తెలిసిందే. ప్రస్తుతం లోక్ సత్తా పార్టీ నాయకులు గా కొనసాగుతున్న పలువురు జనసేన పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వీరు జనసేన వర్గాలతో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. అయితే తుది విడత చర్చలు గా వీరు పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది.

లోక్ సత్తా పార్టీ నాయకుడు కటారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ జరపనున్నట్లు సమాచారం. అయితే లోక్ సత్తా పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పార్టీ వీడి జనసేనలో చేరనున్నారా లేదంటే అదే పార్టీలో ఉంటూ పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారా అన్నదానిమీద స్పష్టత లేదు. లోక్సత్తా పార్టీ జనసేన లో విలీనం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు ఊహాగానాలు చేస్తున్నప్పటికీ తుది విడత చర్చల వివరాలు బయటికి వచ్చాకే వీటన్నిటిమీద స్పష్టత రానుంది.

ఏదిఏమైనా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే ముందడుగు వేస్తున్నట్టు అర్థమవుతోంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close