యాకుబ్ మీమన్ అంతిమ పోరాటం

ముంబై ప్రేలుళ్ళలో దోషి యాకుబ్ మీమన్ ఉరి శిక్షను నిలిపివేసి, దానిని యావజ్జీవ కారాగార శిక్ష మార్చమని కోరుతూ అతని భార్య వేసిన పిటిషన్ని జస్టిస్ దీపక్ మిశ్ర, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్ మరియు అమితావ రాయ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈరోజు విచారణకు స్వీకరించింది. ఇంతవరకు యాకుబ్ తరపున లాయర్ల వాదన విన్న తరువాత ధర్మాసనం ఈకేసును మధ్యహ్నం రెండు గంటలకు వాయిదా వేసింది. తరువాత సెషన్ లో మహారాష్ట్ర ప్రభుత్వం తరపున భారత అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహాత్గీ వాదిస్తారు. అనేకమంది పౌరుల మరణానికి కారకుడయిన యాకుబ్ మీమన్ని క్షమించవద్దని ఆయన వాదిస్తున్నారు.

ఇక మరో ఆసక్తికరమయిన పరిణామం ఏమిటంటే యాకుబ్ మీమన్ మళ్ళీ ఈరోజు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదివరకులాగే ఈకేసుపై భిన్నాభిప్రాయం వ్యక్తపరిచే అవకాశం ఉందేమో కానీ రాష్ట్రపతి తన అభిప్రాయాన్ని మార్చుకోక పోవచ్చును. ఆయన మనసు మార్చుకొని యాకుబ్ మీమన్ కి ఇప్పుడు క్షమాభిక్ష పెట్టినట్లయితే అంతకు ముందు ఆయన తీసుకొన్న నిర్ణయం తప్పని ఆయనే అంగీకరించినట్లవుతుంది. కనుక యాకుబ్ ఈరోజు పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్ని ఆయన తిరస్కరించే అవకాశాలే ఎక్కువని చెప్పవచ్చును. అటువంటప్పుడు యాకుబ్ జీవితం నేడు సుప్రీం తీర్పు పైనే ఆధారపడుందని భావించవచ్చును. ఒకవేళ ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం అతని మరణశిక్షని ఖరారు చేసినట్లయితే రేపు ఉదయం అతనికి నాగపూర్ జైల్లో ఉరి తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close