చిన్న కాంట్రాక్టర్లను చిదిమేసిన జగన్ రెడ్డి !

ప్రభుత్వం అంటే.. ఎవరికైనా ఓ నమ్మకం. ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తే లీడర్లు, అధికారులకు లంచాలిచ్చి అయినా పదో పరకో వెనకేసుకోవచ్చని అనుకుంటారు. కానీ ఇప్పుడు అసలు బాబోయ్ ప్రభుత్వ పనులా అని కాంట్రాక్టర్లు పారిపోతున్నారు. వారికి పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్ లో ఉండటంతో వారెవరూ పనులు చేయడం లేదు. ప్రభుత్వానికీ అదే కావాలి. ఎందుకంటే పనులేమీ చేయించడం లేదు కాబట్టి పట్టించుకోవడం లేదు. పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వడంలేదు.

ముఖ్యంగా ప్రభుత్వానికి అవసరమైన రోజువారీ పనులు చేసే కాంట్రాక్టర్లకు రెండు వేల కోట్ల రూపాయలకుపై బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఎవరికీ బిల్లులు మంజూరు చేయడం లేదు. ఇరవై శాతం కమిషన్ తీసుకుని అయినా మా డబ్బులు మాకిప్పించండయ్యా అని వారంతా నేతల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. వారంతా ఉద్యమ బాట పట్టారు. ధర్నాలకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు వాపోతున్నారు.

నిజానికిు గతంలో ఇలాంటి కాంట్రాక్టర్లు ప్రభుత్వం డబ్బులివ్వకపోతే హైకోర్టుకు వెళ్లేవారు. హైకోర్టు న్యాయం చేసేది. ఇటీవలి కాలంలో హైకోర్టులో కూడా వారికి ఊరట లభించడం లేదు. హైకోర్టులో విచారణకు రావడం తగ్గిపోయింది. విచారణ వచ్చిన పిటిషన్లకు ప్రభుత్వం.. జీవో ఇచ్చాం… సీఎఫ్ఎంఎస్‌లో పెట్టాం.. బటన్ నొక్కాం అంటూ కబుర్లు చెప్పి వాయిదాలేస్తోంది. చివరికి డబ్బులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా… పట్టించుకునే దిక్కూ దివాణం లేకుండా పోయింది.

ఏపీలో వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయినట్లుగా కనిపిస్తోంది. నిజంగా డబ్బులు లేవా… అంటే అలాంటి సమస్య లేదు. ఆరు నెలల్లో వచ్చిన ఆదాయం కాక 90వేల కోట్ల అప్పును జగన్ రెడ్డి సర్కార్ చేసింది. అభివృద్ధి కోసం చేసిన ఖర్చేమీ లేదు. పథకాలన్నీపెండింగ్ లో ఉన్నాయి. రైతు భరోసా బటన్ నొక్కితే… ఒక్కో రైతు ఖాతాలో పడాల్సిన రెండు వేలు కూడా వారమైనా పడలేదు. మరి డబ్బులన్నీ ఏమవుతున్నాయంటే… అస్మదీయులైన బడా కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లింపులు చేస్తున్నారు. గత రెండు నెలల్లోనే పది వేల కోట్లు చెల్లించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close