ఏపీలో అరాచకం : ఈ సారి గన్నవరంలో వైసీపీ మూకల స్వైరవిహారం !

ఏపీలో అరాచక వ్యవస్థ రోజు రోజుకు వికృతరూపం దాలుస్తోంది. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని చంపేస్తామన్నట్లుగా తీరు ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు, ఇళ్లు, కార్యాలయాలపై జరుగుతున్న దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఆఫీసుపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేశారు. కత్తులు, పెట్రోల్ క్యాన్లతో ప్రణాళిక ప్రకారం వచ్చి విధ్వంసం సృష్టించారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్లపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దొరకిన వారిని దొరికినట్లుగా కొట్టే ప్రయత్నం చేశారు.

ఇంత జరుగుతున్న పోలీసులు ఎవరూ .. వైసీపీ నేతలు దాడులు చేసి వెళ్లేవరకూ ఒక్కరూ రాలేదు. వారు వెళ్లిపోయిన తర్వాత తీరికగా వచ్చారు. కృష్ణా జిల్లాలో చాలా కాలంగా పోలీసులు దాడులు జరిగిన తర్వాతే వస్తున్నారు. పట్టాభి ఇంట్లో దాడి జరిగిన సమయంలో ముందుగా పోలీసులే రెక్కీ నిర్వహించి సమాచారం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన సమయంలో ఓ సీఐ… టీడీపీ నేతలకు చిక్కారు. ఇప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైసీపీ నేతలు దాడి చేసిన విషయంలోనూ పోలీసుల విధి నిర్వహణ తీరు అనేక విమర్శలకు కారణం అవుతోంది.

ప్రతిపక్ష నేతల పర్యటనలను అడ్డుకోవడానికి వేల మంది పోలీసుల్ని మోహరిస్తున్నారు. అరాచక శక్తుల నుంచి .. ప్రజలను కాపాడటానికి మాత్రం ఎలాంటి ప్రయత్నం చే్యడం లేదు. రాజకీయ వివాదాలు.. విమర్శలకు .. దాడులు చేస్తాం.. అంతం చేస్తామన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉంది. ముఖ్యమంత్రే.. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. టీడీపీ ఆఫీసుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సమయంలో మా కార్యకర్తలకు బీపీ వచ్చిందని ఆయన సమర్థించుకున్నారు. ఇప్పుడు గన్నవరంలో వైసీపీ కార్యకర్తలకు బీపీ వచ్చిందని.. వల్లభనేని వంశీ సమర్థించుకుంటారమో చూడాల్సి ఉంది.

ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలు కాపాడటం ప్రభుత్వాల విధి. అందులో ఫెయిలయితే.. పాలనలో విఫలమయినట్లే. అయితే ప్రతిపక్షాలపై.. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం.. తమ హక్కు అన్నట్లుగా పాలక పార్టీ ఉండటంతో ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close