ఆంధ్రా గొప్పతనాన్ని కూడా “మోడీ దయ”గా జగన్ ఎలా చెబుతారు..?

ప్రధాని హోదాలో మోడీ కొరియాకు వెళ్తే.. కియా పరిశ్రమ వచ్చిందని.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీజే్పీ నేతలు కూడా.. ఏదో పేపర్లో కొరియా అధినేతతో కలిసి దిగిన ఫోటోతో వచ్చిన ఆర్టికల్‌ను పట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ మోడీ.. ఈ ఐదేళ్ల కాలంలో వంద దేశాలకుపైగా తిరిగారు. కియా లాంటి పరిశ్రమ దేశంలో ఇంకెక్కడైనా తెచ్చారా..? మేకిన్‌ ఇండియా అంటూ కేంద్రం అయిదేళ్ళుగా భారీ ప్రచారం చేసుకున్నా, దేశంలో ఎక్కడా కొత్తగా ఒక ప్రొడక్షన్‌ యూనిట్‌ మొదలైన దాఖలా లేదు.

ఏపీ స్వయంకృషితో సాధించినది కియా మోటార్స్‌. అతి పెద్ద ఆటోమొబైల్‌ ప్రాజెక్టుల్లో కియా ఒకటి. వేల కోట్ల పెట్టుబడులేకాదు.. భారీ స్థాయిలో మాన్యుఫాక్చరింగ్‌ జరిగే యూనిట్‌ కియా. దీనితో పాటు అనుబంధ పరిశ్రమలు భారీగా ఏర్పాటు అవుతున్నాయి. ఇలాంటి ప్రాజెక్టు గురించి దేశం గొప్పగా చెప్పుకుంటోంది. కియాను ఏపీకి తీసుకు రావడానికి ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చింది. మూడు నెలల్లో వారు అడిగిన సౌకర్యాలన్నీ కల్పించామని చంద్రబాబు చెప్పడమే కాదు… కియా మోటార్స్‌ ప్రతినిధులు కూడా కొరియాలోనూ, చైనాలోనూ ఇప్పటికే చెప్పారు. ఏపీలో పెట్టుబడుల సదస్సులో కియా ప్రతినిధులు ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ జగన్‌ మాత్రం కియా తెచ్చిన ఘనతను మోడీకే ఇచ్చేసారు.

జగన్‌ ప్రకటన సెల్ఫ్‌ గోల్‌లా మారింది. ఏపీ ఆత్మగౌరవాన్ని మరోసారి బీజేపీ మెప్పు పొందేందుకు జగన్ ఉపయోగించుకున్నారు. సాధారణ విషయాలు కూడా తన గొప్పలుగా మలచుకునే మోదీ కియాలాంటి ప్రాజెక్టును ఏపీకి వచ్చేలా చేసి ఉంటే.. వదిలేవారా..? నాలుగేళ్ళుగా హోరెత్తించేవారు. కియా ప్రతినిధులే, కొరియా పారిశ్రామిక బృందమే స్వయంగా చెప్పిన తర్వాత చంద్రబాబు కృషి అపూర్వం అని దావోస్‌లాంటి అంతర్జాతీయ వేదికలపై కూడా పొగిడిన తర్వాత మోడీకి ఆ అవకాశం లేదు. అందుకే ఆయన రెండు, మూడు సార్లు ఏపీకి వచ్చినా.. కియా గురించి చెప్పుకోలేకపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close