జనం మూడ్‌ని బట్టి ప్రసంగం..! ప్రచార శైలిని మార్చేసిన చంద్రబాబు..!

సాధారణంగా రాజకీయ ప్రసంగాలంటే… అధ్యక్షుడు వస్తారు.. ప్రసంగించి వెళ్లిపోతారు. చంద్రబాబు అయినా.. ఇప్పటి వరకూ అదే చేశారు. కానీ ఇప్పటి ప్రచారంలో తేడా కనిపిస్తోంది. ప్రజా స్పందనను బట్టి .. భాషను మారుస్తున్నారు. టాపిక్‌ను మారుస్తున్నారు. ప్రజల్లో ఉత్సాహాన్నిచ్చే అంశాలనే హైలెట్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో స్టైల్ మార్చారు. ధాటిగా జగన్ పై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు చేస్తున్న ఒక్క విమర్శకూ జగన్ కౌంటర్ ఇవ్వకపోతూండటంతో .. ఆ కోణంలో.. విమర్శల దాడి పెంచుకుంటూ పోతున్నారు. ప్రజలకు ప్రశ్నలు సంధించి ..జగన్ కు వ్యతిరేకంగా జవాబులు రాబడుతున్నారు.

జగన్ కేసీఆర్, మోదీలతో.. జగన్ సన్నిహితంగా వ్యవహరిస్తూండటం.. వారిపై ఒక్క మాట మాట్లాడకపోతున్న విషయాన్ని సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు చంద్రబాబు. ఎప్పుడూ లేని విధంగా.. మాస్ లాంగ్వేజ్‌ను ఉపయోగిస్తున్నారు. పడికట్టు పదాలకు.. స్వస్తి చెప్పి.. సాధారణ జనం ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారో.. అలాగే మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ను చూస్తే జగన్ తడిపేసుకుంటాడని.. వ్యాఖ్యానించడం ఇందులో భాగమే. జగన్మోహన్ రెడ్డిని మాత్రమే కాదు.. పవన్ కల్యాణ్‌నూ చంద్రబాబు వదిలి పెట్టడం లేదు. ఆయన ప్రభావం ఉంటుందని అనుకున్న చోట.. పవన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో.. చంద్రబాబు ఇదే విషయాన్ని సూటిగా చెప్పారు. సినిమా నటుడు మనకు అవసరమా.. అని ప్రశ్నించారు. ఆయనను సినిమాలు చేసుకోనివ్వాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు తన మానాన తాను.. ప్రసంగించి వెళ్లిపోవడం లేదు. ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. వారి దగ్గర్నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చేలా ఉత్సాహం చూపిస్తున్నారు. సైకిల్ జోలికి వస్తే ఎలా ఉంటుందో.. వివరిస్తున్నారు. చంద్రబాబు గత ప్రసంగాలకు.. ఇప్పటికీ స్పష్టమైన తేడా కనిపిస్తోంది. సూటిగా ఆసక్తికరంగా.. ఎక్కడికి వెళ్తే అక్కడ… వాడుక భాషను ఉపయోగిస్తూ ప్రచారం చేస్తూ… హాట్ టాపిక్ అవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close