తన ఫోన్ ట్యాపింగ్ చేసి..తన ఆడియోను తనకే వినిపించారని.. ఆ వీడియోను సుబ్బారెడ్డి తనకు వినిపించారని షర్మిల ప్రకటించారు. అయితే షర్మిల ప్రస్తావన లేకుండా సుబ్బారెడ్డి తెలివి పచ్చ మీడియాలో వచ్చిందంటూ ఖండించారు. కానీ షర్మిల మాత్రం వదిలి పెట్టలేదు. దొంగ ఎక్కడైనా దొంగ అని ఒప్పుకుంటాడా అని ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి దగ్గర ట్యాప్ అయిన నా ఆడియో ఉంది..ఇది నిజమో కాదో.. వైవీ సుబ్బారెడ్డి తన కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి నిజం చెప్పాలని సవాల్ చేశారు. వైవీ చేతికి ఆ ఆడియో ఎలా వచ్చింది ? ఎవరైనా ఇస్తే వచ్చిందే కదా..వైవీ నీ విచారణకు పిలవాలి.ట్యాపింగ్ లో నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
మా ఇంట్లో కూర్చుని నాకే వినిపించారు కాబట్టి చెప్తున్నానని.. బైబిల్ మీద ,నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నానని షర్మిల అన్నారు. ట్యాపింగ్ మాకేం అవసరం అని ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.. నేను ఆర్థికంగా,రాజకీయంగా ఎదగకూడదు అని చేశారన్నారు. నేను ఎవరిని మీట్ అవుతున్నాం అని గ్రహించారు..- నాకు సపోర్ట్ ఇవ్వకుండా పెద్ద పెద్ద నాయకులను ఆపి వేశారన్నారు. ఇదంతా ఫోన్ ట్యాప్ చేసి జరిపిన కుట్రేనని స్పష్టం చేశారు.
ఆనాడు సుబ్బారెడ్డి తో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆస్తుల విషయంలో కుట్రలు పన్ని సుబ్బారెడ్డితో అబద్ధాలు జగన్ చెప్పించాడు.. అప్పటి నుంచి నాకు సుబ్బారెడ్డి కి మాటలు లేవన్నారు. మా నాన్న లాంటి సుబ్బారెడ్డి నాకే స్వయంగా వినిపిస్తే నేను ఎంత బాధపడి ఉంటానో అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు విచారణ జరుగుతుందన్నారు. సుబ్బారెడ్డి నీ కూడా విచారణ కు పిలవాలని.. కాల్ ట్యాపింగ్ నా వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని షర్మిల స్పష్టం చేశారు.
తెలంగాణలో ట్యాపింగ్ చేస్తే నాకేం సంబంధం అని జగన్ మొత్తం నింద.. కేసీఆర్, కేటీఆర్లపై తోసేశారు. కానీ వైవీ సుబ్బారెడ్డికి ఎలా వచ్చిందో ఇప్పుడు ఆయన సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.