వైసీపీ అభ్యర్థులెవరూ ధీమాగా లేరు..! నిలకడ లేని జగన్ తీరే కారణమా..?

ఆ చివరన ఉన్న హిందూపురం.. ఈ చివరన ఉన్న భీమిలి వరకు.. అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ సమన్వయకర్తలెవరూ ధీమాగా లేరు. కనీసం అరవై నుంచి 70 మంది సమన్వయకర్తలకు అదే పరిస్థితి దారుణంగా ఉంది. టిక్కెట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఎవరు కొత్తగా పార్టీలో చేరినా ఉలిక్కి పడుతున్నారు. ఒక్కో చోట… ఇద్దరు ముగ్గురు సమన్వయకర్తలను కూడా మార్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వారందరికీ ఏమైనా గ్యారంటీ ఉందా… అంటే అదీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి… పూర్తిగా ఒకే మిషన్ మీద గురి పెట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు.. ఎవరు వచ్చినా చేర్చేసుకుని టిక్కెట్లు ఇవ్వడం ప్రారంభించారు. వారంతట వారు రావడం వేరు.. ఇతర మార్గాల ద్వారా ఒత్తిడి తెచ్చి టిక్కెట్లు ఇచ్చి మరీ పార్టీలోకి తీసుకోవడం వేరు. ఆ పద్దతిని కూడా.. జగన్ ఫాలో అవుతున్నారు. ఇలా… ఇప్పటి వరకూ ఉన్న సమన్వయకర్తలకు.. జగన్ ఎప్పటికిప్పుడు హ్యాండ్ ఇస్తూ.. కొత్త వారిని పార్టీలో చేర్చేసుకుంటున్నారు.

రాజంపేటలో..వైసీపీ పెట్టినప్పటి నుంచి తనతో పాటు నడిచిన అమరనాథరెడ్డికి మొండి చేయి చూపిన.. జగన్మోహన్ రెడ్డి… టీడీపీ నుంచి గెలిచిన మేడా మల్లిఖార్జునరెడ్డిని పార్టీలో చేర్చుకుని అవకాశం ఇచ్చారు. ఆ పరంపర అలా సాగుతోంది. హిందూపురంలో అబ్దుల్ ఘనీ, విజయవాడలో యలమంచిలి రవి, నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి, ప్రకాశంలో.. మాగుంట శ్రీనివాసులరెడ్డి, పశ్చిమగోదావరి రఘురామకృష్ణం రాజు, తూర్పుగోదావరిలో తట నరసింహం కుటుంబం, విశాఖలో దాడి వీరభద్రరావు కుటుంబం.. ఇలా… కొత్తగా వచ్చే నేతల్ని చేర్చుకుని.. అంతకు మించిన నేతలు దొరకరకన్నట్లుగా.. టిక్కెట్లు ప్రకటిస్తున్నారు. వీరే కాదు.. హైదరాబాద్ లో నివాసం ఉంటూ.. ఏపీలో సొంత నియోజకవర్గం అంటూ లేకుండా.. దశాబ్దాల పాటు రాజకీయంగా దూరంగా ఉన్న వారిని కూడా పిలిచి… మెడలో కండువా కప్పేస్తున్నారు. వారికి టిక్కెట్లిస్తారో లేదో క్లారిటీ లేదు కానీ.. వీరిని పరిగణనలోకి తీసుకుంటే.. మరింత మంది సమన్వయకర్తలు త్యాగాలు చేయక తప్పదు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలను.. నియోజకవర్గ సమన్వయకర్తలు నిర్వహించారు. పార్టీ తరపున ఎలాంటి సాయం రాకపోయినప్పటికీ.. సొంత ఖర్చులతో నిర్వహించుకున్నారు. కార్యాలయాల ఖర్చుకూడా.. చివరికి సమన్వయకర్తలదే. ఓడిపోయినా.. భవిష్యత్ పై ఆశతో… వారంతా ఆస్తులు అమ్మి.. అప్పులు చేసి పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పుడు.. అవకాశం లేదనడంతో.. వారంతా హతాశులవుతున్నారు. అందుకే.. నియోజకవర్గాల్లో.. ఆ పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించడం లేదు. టిక్కెట్లు మీకే అని జగన్ స్వయంగా చెప్పినప్పటికీ చాలా మంది నమ్మడం లేదు. గతంలోనూ.. అలాగే చెప్పి… హ్యాండిస్తారేమో.. ఖర్చు పెట్టుకుని ఖర్చయిపోతామేమో అని ఆందోళన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close