ఓడి గెలిచిన సైనా నెహ్వాల్

హైదరాబాదీ సంచలనం సైనా నెహ్వాల్ సత్తా ఏంతో ప్రపంచానికి మరోసారి తెలిసివచ్చింది. గత వారం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఓడినప్పటికీ, సైనా ప్రపంచ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ఫైనల్లో తనను ఓడించిన స్పెయిన అమ్మాయి కరోలినా కంటే ఎక్కువ పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది.

కరోలినా 80,612 పాయింట్లు పొందింది. సైనా 82,792 పాయింట్లు సాధించింది. సైనా నెహ్వాల్ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోవడం ఇది రెండోసారి. గత మార్చిలో తొలిసారిగా నెంబర్ వన్ ర్యాంకు సాధించింది. అయితే కొద్ది రోజుల్లోనే చేజార్చుకుని రెండో ర్యాంకుకు పడిపోయింది.

ఇటీవల టోర్నీ ఫైనల్లో ఓడిన తర్వాత ఇప్పట్లో నెంబర్ వన్ కాదేమో అని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే, గత కొంతకాలంగా వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన సైనా, ఓవరాల్ ప్రద్శనన విషయంలో కరోలినా కంటే ముందంజలో నిలిచింది. అదే ఆమెకు అనుకూలాంశంగా మారింది. నెంబర్ బన్ ర్యాంకు కట్టబెట్టింది.

ఇక పురుషుల విభాగంలో శ్రీకాంత్ ర్యాంకు స్వల్పంగా తగ్గింది. ఒక ర్యాంకు కోల్పోయి నాలుగో స్థానానికి చేరాడు. మరోవైపు, మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు ప్రపంచ ర్యాంకింగ్స్ లో కాస్త వెనుకబడింది. ఇప్పటి వరకు 13వ ర్యాంకులో ఉన్న సింధు, 14 స్థానానికి చేరింది. డబుల్స్ విభాగంగా గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడీ పదో ర్యాంకు సాధించింది.

భారతీయ క్రీడాకారులు, ముఖ్యంగా హైదరాబాదీలు బ్మాడ్మింటన్ లో తమదైన ముద్ర వేస్తున్నారు. ర్యాంకు విషయంలో కాస్త హెచ్చుతగ్గులున్నా, దేశం మొత్తం మీద ఈ క్రీడకు వీరే ప్రస్తుతానికి అసలైన భారతీయ ప్రతినిధులుగా సత్తా చాటుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close