దీపం పెట్టమంటే దీపావళి పండగ చేసేశారు..!

నరేంద్రమోదీ ఏం చెప్పారు..?

ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ఇంట్లో లైట్లు ఆర్పేసి.. ఒక్క క్యాండిల్.. అదీ లేకపోతే… ఓ టార్చ్.. అదీ లేకపోతే.. సెల్ ఫోన్ లైట్ ని తొమ్మిది నిమిషాల సేపు వెలిగించమని చెప్పారు. ఇలా ఎందుకు చేయాలో… ఇలా చేస్తే ఏం వస్తుందో… చెప్పే అవకాశాన్ని దేశంలో ఉన్న అన్ని రంగాల నిపుణులకు వదిలేశారు. సైన్స్, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం దగ్గర్నుంచి పుక్కిటి పురాణాల వరకూ.. అందులో నిపుణులం అని అనిపించున్నవారు.. అనిపించునేందుకు ప్రయత్నిస్తున్న వారు.. తమ తమ సిద్ధాంతాలను చెప్పారు. ఇవన్నీ.. చాలా మందికి బాగా ఎక్కేశాయి. ఒక్క దీపానికే అంత శక్తి ఉంటే… ఏకంగా దీపావళి పండగ చేసేస్తే.. ఇంకెంత గొప్పగా.. కోవిడ్ -19పై పోరాటం చేసినట్లుగా ఉంటుందని డిసైడయ్యారు. దీపావళి పండగ చేసేశారు.

ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు.. టపాసుల మోత మార్మోగింది. అసలు దీపం ఆలోచనల దగ్గరే ఉండిపోయిన కొంత మంది ఉలిక్కిపడ్డారు. తాము తెచ్చుకోలేదని కొందరు… మోడీ గారు అలా టపాసులు కాల్చలేదని చెప్పలేదుగా అని మరికొందరు ఆలోచనలో పడ్డారు. కానీ ముందు చూపున్నవారు.. మోడీ చూసి రమ్మకంటే.. కాల్చివచ్చేందుకు సిద్ధపడేవారు మాత్రం.. టపాసులతో హోరెత్తించారు. లాక్ డౌన్ వల్ల.. తగ్గిపోయిన ఆ కాస్త కాలుష్యాన్ని బ్యాలెన్స్ చేశారు. అసలు ఈ దీపం ఉద్దేశం ఏమిటో.. ఎవరూ ఆలోచించే ప్రయత్నం కూడా చేయలేదు. రోడ్ల మీదకు వచ్చేశారు. గో కరోనా గో..అంటూ గుంపులు, గుంపులుగా ర్యాలీలు తీశారు. సామాజిక దూరం కాదు కదా.. అసలు కరోనా గురించి టెన్షనే పడలేదు. పండగ చేసుకున్నారు.

దేశంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. లాక్ డౌన్ లో ఉందని… వైరస్ అత్యంత దారుణంగా దాడి చేస్తోందన్న విషయాన్ని ప్రజలు ఆ కొద్ది సేపు మర్చిపోయారు. ఏ రూల్స్ పాటించలేదు.. ఏ నిబంధనలు అమలు చేయలేదు. ఇళ్లకే పరిమితమయి.. మానసికంగా… కొద్దిగా విశ్వాసాన్ని కోల్పోతున్న వారికి.. నమ్మకం కలిగించడానికి ఇలాంటి కార్యక్రమాలు బాగుంటాయేమో కానీ.. అతి ఉత్సాహంతో .. మొత్తం లక్ష్యానికే దెబ్బపడేలా చేయడం మన వాళ్ల స్పెషాలిటి. నాటి చప్పట్లలో కాస్త అతి కనిపించింది కానీ.. ఇప్పుడు అది పీక్స్ కు వెళ్లిపోయింది. నెక్ట్స్ .. బిగ్ బాస్ మోడీ ఎం టాస్క్ ఇస్తారో కానీ.. ఈ సారి మరింత రచ్చ రచ్చ అయిపోవడం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close