పేదలకు బతుకుపై భరోసా..! కాంగ్రెస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యమేనా..?

కాంగ్రెస్ పార్టీ ప్రజాకర్షణ మేనిఫెస్టోను ప్రకటించింది. న్యాయ్ పథకం ద్వారా పేదలకు ఏడాదికి 72 వేల రూపాయల చొప్పున అందిస్తామన్నది కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి కీలకాంశం. అధ్యయనం చేసి, అర్థం చేసుకున్న తర్వాత ఆచరణ సాధ్యమని గ్రహించి ఈ పథకాన్ని ప్రకటించామని రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. ప్రధానంగా ఐదు పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. మొదటి అంశం న్యాయ్‌కు సంబంధించినది. రెండోది ఉద్యోగాల భర్తీ. ప్రస్తుతం ఖాళీ ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేస్తామన్నది రెండో హామీ. పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, కొత్తగా వ్యాపారం చేసుకునేవారికి తొలి మూడేళ్ల పాటు ఎలాంటి అనుమతులూ అవసరం లేకుండా చేస్తామని కాంగ్రెస్ చెబుతుంది. గ్రామీణ ఉపాధి హామీని పటిష్ఠం చేస్తూ… ఇప్పుడున్న పని దినాలను 100 నుంచి 150కి పెంచుతామి హామీ ఇచ్చారు.

రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ తీసుకురావడం మూడోది. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యా, నీరవ్ మోదీ లాంటి వారిని వదిలేస్తున్నారని, పేద రైతులను మాత్రం ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ అంటోంది. ఇకపై రుణాలు చెల్లించలేని రైతులపై పెట్టే కేసులను క్రిమినల్ కేసులుగా పరిగణించబోమని, వాటిని సివిల్ కేసులుగా లెక్కగడతామని రాహుల్ స్వయంగా చెప్పారు. వ్యవసాయాభివృద్ధికి జాతీయ కమిషన్ ఏర్పాటు చేస్తారు. స్థూల జాతీయోత్పత్తిలో ఆరు శాతాన్ని విద్యా రంగానికి కేటాయిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అందరికీ అత్యుత్తమ విద్యా సంస్థల్లో చదువుకునే అవకాశం కల్పిస్తామన్నారు. విద్యాలయాల్లో తగిన మౌలిక సదుపాయాలతో పాటు అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయుల్ని నియమిస్తామన్నారు. వైద్య రంగానికి పెద్ద పీట వేయడం ఐదో కీలక హామీ. ప్రస్తుతం పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రైవేటు బీమా సంస్థలకు చెల్లించే పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ ఆరోపించింది. పేదలకు మేలైన వైద్య సేవలు అందిస్తామన్నారు.

అధికారంలోకి రాగానే రఫేల్‌ ఒప్పందం మీద విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వివిధ బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిపై సమగ్ర విచారణ విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. మోదీ ప్రోత్సాహంతోనే ఆర్థిక నేరగాళ్లు రెచ్చిపోతున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రజల వాక్కు విన్న తర్వాత, వారి ఆలోచనా విధానం తెలుసుకున్న తర్వాతే మేనిఫెస్టో రూపొందించారు. సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో సిద్ధం చేశారు. దేశం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోందని, సమస్యల నుంచి జనాన్ని గట్టెక్కించడమే తమ కర్తవ్యమని కాంగ్రెస్ పార్టీ అంటోంది. గబ్బర్ సింగ్ టాక్స్‌ను మళ్లీ జీఎస్టీగా మార్చుతామని కాంగ్రెస్ చెబుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close