మీరు ఎన్ని వందల కోట్లు ఖర్చుపెట్టినా, నేను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఆపలేరు: పవన్

ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈరోజు యలమంచిలి లో పర్యటించారు. యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ ను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరిన పవన్ కళ్యాణ్, ఈ సభలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తనని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాలని ప్రత్యర్థి పార్టీలు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నాయి అని అన్న పవన్ కళ్యాణ్, ” మీరు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఆపలేరు” అంటూ ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసిరారు. జనసేన నాయకులు అసెంబ్లీలో ఉండడం చాలా అవసరం అని చెప్పిన పవన్ కళ్యాణ్, జనసేన గనక లేకపోతే ఈ రెండు పార్టీలు కూడా ప్రజా ధనాన్ని దోచుకుంటూనే ఉంటాయి అని వ్యాఖ్యానించారు. తాము అసెంబ్లీలో లేకపోయినప్పటికీ, ఇప్పటికే తెలుగుదేశం వైయస్సార్ సిపి అనే ఈ రెండు పార్టీలను రోడ్ల మీద నుండే కట్టడి చేస్తున్నామని, వారి అవినీతికి వ్యతిరేకంగా బలంగా గళం వినిపిస్తున్నామని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్, ఒక్కసారి తాము అసెంబ్లీలో అడుగు పెడితే ఆ రెండు పార్టీల అవినీతిని ఇంకే రేంజ్లో అడ్డుకుంటామో మీరే చూస్తారని చిటికె వేస్తూ సవాలు విసరడంతో ప్రజల నుండి విపరీతమైన స్పందన వచ్చింది.

అదేవిధంగా ఎలమంచిలి లో ఉన్న స్థానిక సమస్యల గురించి అక్కడ ఉన్న చోటా మోటా నాయకులు పవన్ కళ్యాణ్ కి గుర్తు చేయబోతే, ప్రజాపోరాట యాత్రలో భాగంగా వచ్చినప్పుడే ఈ సమస్యలను తాను తెలుసుకున్నానని అంటూ, ఆ సమస్యలను అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ వారికి తిరిగి చెప్పారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఎలమంచిలి సమస్యలు తెలుసుకున్నానని, ఇప్పుడు జనసేన నాయకులని అసెంబ్లీ కి పంపిస్తే వాటన్నింటినీ కచ్చితంగా తీరుస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. భారీగా హాజరైన జనాల మధ్య పవన్ కళ్యాణ్ సభ ఎలమంచిలిలో విజయవంతం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close