చైతన్య : రాజకీయ రచ్చతో “ఇంటర్” నిందితులు తప్పించుకున్నట్లే..!

తెలంగాణలో ఐదేళ్ల కాలంలో ఎన్నో సంచలనాత్మక విషయాలు వెలుగు చూశాయి. డ్రగ్స్ కేసు, నయీం కేసుల్లాంటివి ఎన్నో… తెరమీదకు వచ్చినంత వేగంగానే వెనక్కుపోయాయి. ఎంత హడావుడి చేశారంటే.. ఇక తేల్చేయడమే తరువాయని చెప్పి కోల్డ్ స్టోరేజీలో పడేశారు. విద్యారంగంలో.. ఎంసెట్ లీకేజీ కూడా అలాంటిదే. ఆ లీకేజీని ఎవరు చేశారో.. ఎవరు నిందితులో.. అన్నీ తెలిసి… తొక్కి పడేశారు. ఇప్పుడు ఇంటర్ ఫలితాల వ్యవహారం. అసలు దొంగలెవరో కళ్ల ముందు కనిపిస్తున్నా… ఎప్పటికీ తేలని వ్యవహారం అని.. తాజా పరిణామాలతో నిరూపితమయిపోతోంది.

తప్పెవరిదో తెలిసినా తెలియనట్లు ఎందుకుంటున్నారు..?

తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్ పరీక్షల ఫలితాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఫెయిలనవాళ్లు పాసయినట్లుగా..పాసయిన వాళ్లు ఫెయిలయినట్లుగా.. తప్పుల తడకగా మార్కుల జాబితాలు వచ్చాయి. ఒకరిద్దరి ఆందోళనతో బయటకు వచ్చిన ఈ వ్యవహారం… చివరికి.. పరీక్ష రాసిన ప్రతి ఒక్కరూ అనుమానపడేలా…రచ్చరచ్చ అయింది. మొదట్లో అంతా అపోహలే అన్న ప్రభుత్వం, ఇంటర్ బోర్డు చివరికి తప్పులు జరిగాయని అంగీకరించక తప్పలేదు. అయితే..దిద్దుబాటు చర్యల్లో పారదర్శకత లోపించింది. హడావుడిగా వేసిన త్రిసభ్య కమిటీ … నివేదికను …ప్రభుత్వం బయట పెట్టలేదు. అందులోని కొన్ని అంశాలను.. విద్యాశాఖ కార్యదర్శి వెల్లడించారు. కానీ నిర్దిష్టంగా.. తప్పు ఎక్కడ జరిగింది..? అన్యాయం జరిగిన విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయాలి..? భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా ఏంచేయాలన్నదానిపై… త్రిసభ్య కమిటీ ఇచ్చిన సిఫార్సుల పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. తప్పు ఎవరు చేశారు..? ఎవరికి శిక్ష వేయాలన‌్న దానిపై.. ప్రభుత్వం మాట్లాడటం లేదు.

గ్లోబరీనా గుట్టు ఎందుకు బయటపెట్టరు..?

అసలు ఇంటర్ ఫలితాల్లో గందరగోళం వచ్చినప్పటి నుంచి అందరి నోళ్లనూ నానుతున్న సాఫ్ట్ వేర్ సంస్థ గ్లోబరీనా. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి గ్లోబరీనా ఇంటర్ బోర్డుకు చుక్కలు చూపిస్తోందనేది బహిరంగరహస్యం. అడ్మిషన్ల వ్యవహారంలో..చేతులెత్తేయడంతో… మళ్లీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో… ఇంటర్ బోర్డు చేయించుకుంది. అయితే.. ఈ గ్లోబరీనా సంస్థ తప్పిదాలు మాత్రం.. బయటకు రావడం లేదు. త్రిసభ్యకమిటీ నివేదికలో.. గ్లోబరీనా గురించి ఏం సిఫార్సులు చేశారో బయటకు రాలేదు. అదే సమయంలో.. అసలు.. ఇంటర్ బోర్డుకు… గ్లోబరీనాకు మధ్య న్యాయబద్ధమైన ఒప్పందం ఏదీ లేదన్న ప్రచారం జరుగుతోంది. అలాంటి ఒప్పందం ఏమీ లేకుండా కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారన్నదానిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ఓ వైపు విద్యార్థుల ఆందోళన.. మరో వైపు.. గ్లోబరీనా వ్యవహారం.. విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సంస్థను కాపాడటానికే… ప్రభుత్వం పని చేస్తోందన్న అనుమానం అందరిలోనూ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి.

అన్యాయమైపోయిన విద్యార్థులకు ఎలా చేస్తారు..?

రాజకీయపార్టీలు ఒక్కసారిగా ఇంటర్ బోర్డు వ్యవహారాన్ని రాజకీయం చేశాయి. ఇటీవలి కాలంలో ఓ సమస్య విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై విపక్షాలన్నీ పోరాటం చేయడం ఇదే ప్రథమం. దాంతో ఈ అంశంగా పెనుసంచలనం అయింది. గ్లోబరీనా సంస్థ యాజమాన్యానికి టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపణలు చేస్తూ.. రాజకీయ పార్టీలన్నీ ఆ సంస్థనే గురి పెట్టాయి. ఓ రకంగా ఇప్పుడు ఇంటర్ ఫలితాల వ్యవహారం రాజకీయం అయిపోయింది. విద్యార్థులకు న్యాయం చేసేలక్ష్యంతో.. పోరాటం ప్రారంభించిన రాజకీయపార్టీలు ఆ లక్ష్యానికి దూరంగా..సొంత పొలిటికల్ మైలేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓ వైపు… విద్యార్థుల ఆత్మహత్యలు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. జాతీయ మానవ హక్కుల సంస్థ కూడా నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారు. కానీ ఇప్పటికే విషయం పక్కదారి పట్టిపోయింది. అన్యాయమైపోయిన విద్యార్థులు రోదిస్తూనే ఉన్నారు. రాజకీయం మాత్రం… అసలు విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close